బ్రిడ్జి పైనుంచి టన్నెల్‌లో పడిపోయిన ట్రక్కు

- December 09, 2020 , by Maagulf
బ్రిడ్జి పైనుంచి టన్నెల్‌లో పడిపోయిన ట్రక్కు

సౌదీ: ఇసుకను తీసుకెళుతున్న ఓ ట్రక్కు, అల్‌ నహ్దా బ్రిడ్జి నుంచి ఒమన్‌ బిన్‌ అబ్దుల్‌అజీజ్‌ అండర్‌పాస్‌లోకి పడిపోయింది. సౌదీ క్యాపిటల్‌ రియాద్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కారు కూడా ధ్వంసమయ్యింది. 30 ఏళ్ళ సుడానీ డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, ఓ వ్యక్తిని రక్షించారు. అతనికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. అతనికి వెంటనే ఫస్ట్‌ ఎయిడ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని రియాద్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ అధికార ప్రతినిథి కల్నల్‌ నవాఫ్‌ అల్‌ సుదైరి చెప్పారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com