బ్రిడ్జి పైనుంచి టన్నెల్లో పడిపోయిన ట్రక్కు
- December 09, 2020
సౌదీ: ఇసుకను తీసుకెళుతున్న ఓ ట్రక్కు, అల్ నహ్దా బ్రిడ్జి నుంచి ఒమన్ బిన్ అబ్దుల్అజీజ్ అండర్పాస్లోకి పడిపోయింది. సౌదీ క్యాపిటల్ రియాద్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కారు కూడా ధ్వంసమయ్యింది. 30 ఏళ్ళ సుడానీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, ఓ వ్యక్తిని రక్షించారు. అతనికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. అతనికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని రియాద్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిథి కల్నల్ నవాఫ్ అల్ సుదైరి చెప్పారు.
తాజా వార్తలు
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!







