ఇజ్రాయిల్:తొలి వాక్సిన్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ కే...
- December 09, 2020ఇజ్రాయిల్:కరోనా వైరస్ ప్రపంచాన్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నది.ఇప్పటికే కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు.లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. అయితే, ఫైజర్ కంపెనీ తయారు చేసిన వాక్సిన్ కు అత్యవసర అనుమతులు మంజూరు చేస్తున్నాయి అనేక దేశాలు. 80 లక్షల డోసుల ఫైజర్ వాక్సిన్ కోసం ఇజ్రాయిల్ ప్రభుత్వం ఫైజర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది.ఇందులో భాగంగా మొదటగా ఫైజర్ సంస్థ లక్ష డోసులను పంపించింది. తొలివిడతగా ఇజ్రాయిల్ చేరుకున్న ఆర్డర్ ను రిసీవ్ చేసుకోవడానికి ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నారు.అక్కడ మీడియాతో మాట్లాడారు.ఫైజర్ సంస్థ వాక్సిన్ కు అత్యవసర అనుమతులు ఇంకా మంజూరు కాలేదు.త్వరలోనే అనుమతులు మంజూరు అవుతాయని, అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు కాగానే మొదటి వాక్సిన్ను తానే వేయించుకుంటానని ప్రధాని పేర్కొన్నారు.దీంతో పాటు అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన వాక్సిన్లను ఇజ్రాయిల్ ఆర్డర్ చేసింది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు