ఈ పండ్లు ఇమ్యూనిటీ బూస్టర్లు..
- December 10, 2020రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు తీసుకుంటే శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి వైరస్ సంబంధిత వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. అదృష్టవశాత్తు ఈ సీజన్లో రుచికరమైన పండ్లు విరివిగా లభ్యమవుతాయి. వీటిని పచ్చిగా తినొచ్చు, స్మూతీలో కలపవచ్చు, పచ్చడి చేసుకుని మరింత రుచికరంగా మార్చుకోవచ్చు.
నారింజ
విటమిన్ సి, కాల్షియం నారింజలో అధికంగా ఉంటాయి. సిట్రస్ పండ్లు కాలానుగుణ అంటువ్యాధుల ప్రమాదాన్ని నివారించగలవు. తాజాగా ఉండే నారింజ పండ్ల రసం రోజూ ఓ గ్లాస్ తీసుకుంటే శరీరానికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. యాపిల్స్ రోజుకో యాపిల్ తినడం మంచి ఆలోచన.
యాపిల్స్
శరీరంలో మంటను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. పెక్టిన్ ఫైబర్, విటమిన్ సి, కె సమృద్ధిగా ఉన్న యాపిల్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సహకరిస్తాయని పోషకాహార నిపుణులు భావిస్తారు.
జామకాయ
తీపిగా, రుచికరంగా ఉండే గువా (జామకాయ) ఈ సీజన్లో అత్యధికంగా దొరుకుతాయి.. అందరూ ఇష్టంగా తింటారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె పని తీరును మెరుగు పరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!