తెలంగాణలో తగ్గిన కోవిడ్ కేసులు..
- December 10, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనావైరస్ కేసులు ఓరోజు ఎక్కువగా.. మరోరోజు తక్కువగా నమోదు అవుతూ వస్తున్నాయి.. గత బులెటిన్లో 700కు పైగా పాజిటివ్ కేసులు నమదు కాగా.. తాజా బులెటిన్లో ఆ కేసుల సంఖ్య తగ్గిపోయింది.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 805 మంది రికవరీ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కి చేరుకోగా.. మృతుల సంఖ్య 1,482కి పెరిగింది.. 2,66,925 మంది రికవరీ అయ్యారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,434 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని బులెటిన్లో పేర్కొంది సర్కార్.. ఇక, నిన్న రాత్రి 8గంటల వరకు 53,396 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 59,73,031కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







