తెలంగాణలో తగ్గిన కోవిడ్ కేసులు..
- December 10, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనావైరస్ కేసులు ఓరోజు ఎక్కువగా.. మరోరోజు తక్కువగా నమోదు అవుతూ వస్తున్నాయి.. గత బులెటిన్లో 700కు పైగా పాజిటివ్ కేసులు నమదు కాగా.. తాజా బులెటిన్లో ఆ కేసుల సంఖ్య తగ్గిపోయింది.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 805 మంది రికవరీ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కి చేరుకోగా.. మృతుల సంఖ్య 1,482కి పెరిగింది.. 2,66,925 మంది రికవరీ అయ్యారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,434 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని బులెటిన్లో పేర్కొంది సర్కార్.. ఇక, నిన్న రాత్రి 8గంటల వరకు 53,396 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 59,73,031కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..