ఈ పండ్లు ఇమ్యూనిటీ బూస్టర్లు..
- December 10, 2020
రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు తీసుకుంటే శీతాకాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటి వైరస్ సంబంధిత వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. అదృష్టవశాత్తు ఈ సీజన్లో రుచికరమైన పండ్లు విరివిగా లభ్యమవుతాయి. వీటిని పచ్చిగా తినొచ్చు, స్మూతీలో కలపవచ్చు, పచ్చడి చేసుకుని మరింత రుచికరంగా మార్చుకోవచ్చు.
నారింజ
విటమిన్ సి, కాల్షియం నారింజలో అధికంగా ఉంటాయి. సిట్రస్ పండ్లు కాలానుగుణ అంటువ్యాధుల ప్రమాదాన్ని నివారించగలవు. తాజాగా ఉండే నారింజ పండ్ల రసం రోజూ ఓ గ్లాస్ తీసుకుంటే శరీరానికి విటమిన్ సి పుష్కలంగా అందుతుంది. యాపిల్స్ రోజుకో యాపిల్ తినడం మంచి ఆలోచన.
యాపిల్స్
శరీరంలో మంటను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. పెక్టిన్ ఫైబర్, విటమిన్ సి, కె సమృద్ధిగా ఉన్న యాపిల్స్ రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సహకరిస్తాయని పోషకాహార నిపుణులు భావిస్తారు.
జామకాయ
తీపిగా, రుచికరంగా ఉండే గువా (జామకాయ) ఈ సీజన్లో అత్యధికంగా దొరుకుతాయి.. అందరూ ఇష్టంగా తింటారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె పని తీరును మెరుగు పరుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







