తెలంగాణలో తగ్గిన కోవిడ్ కేసులు..
- December 10, 2020హైదరాబాద్:తెలంగాణలో కరోనావైరస్ కేసులు ఓరోజు ఎక్కువగా.. మరోరోజు తక్కువగా నమోదు అవుతూ వస్తున్నాయి.. గత బులెటిన్లో 700కు పైగా పాజిటివ్ కేసులు నమదు కాగా.. తాజా బులెటిన్లో ఆ కేసుల సంఖ్య తగ్గిపోయింది.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 643 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇద్దరు మృతిచెందారు.. ఇదే సమయంలో 805 మంది రికవరీ అయ్యారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,75,904కి చేరుకోగా.. మృతుల సంఖ్య 1,482కి పెరిగింది.. 2,66,925 మంది రికవరీ అయ్యారు.. రాష్ట్రంలో ప్రస్తుతం 7,497 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 5,434 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని బులెటిన్లో పేర్కొంది సర్కార్.. ఇక, నిన్న రాత్రి 8గంటల వరకు 53,396 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 59,73,031కి చేరింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..