అంతర్జాతీయ భారతి ఉత్సవాల్లో పాల్గొనున్న ప్రధాని

- December 11, 2020 , by Maagulf
అంతర్జాతీయ భారతి ఉత్సవాల్లో పాల్గొనున్న ప్రధాని

చెన్నై: ప్రధాని నరేంద్రమోడి తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి 138వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన అంతర్జాతీయ భారతి ఉత్సవాల్లో పాల్గొననున్నారు. చెన్నైలోని వాసవిల్‌ సాంస్కృతిక కేంద్రంలో ఈ ఉత్సవాలు ఇవాళ జరుగుతున్నాయి. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది వర్చువల్‌ విధానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో సేవలందించినవారికి ప్రధాని మోదీ భారతి అవార్డులను ప్రదానం చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

మహాకవి భారతి ఆశయాలను నెరవేర్చేలా ఆయా రంగాల్లో విశిష్ట సేవలందించినవారికి ప్రతి ఏడాది భారతి వార్డును అందిస్తారు. 1994 నుంచి వాసవిల్‌ సాంస్కృతిక కేంద్రం ఈ పురస్కారాన్ని అందిస్తున్నది. ఈ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీ కవులు, కళాకారులు హాజరుకానున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com