గల్ఫ్ సంక్షోభ నివారణకు కువైట్ కృషిని స్వాగతించిన భారత్

- December 12, 2020 , by Maagulf
గల్ఫ్ సంక్షోభ నివారణకు కువైట్ కృషిని స్వాగతించిన భారత్

కువైట్ సిటీ:గల్ఫ్ దేశాల మధ్య సంక్షోభం, వైరుధ్యాలను నివారించే దిశగా కువైట్ ప్రభుత్వం చేస్తున్న కృషిని భారత ప్రభుత్వం స్వాగతించింది. జీసీసీ సభ్య దేశాల మధ్య పొరపొచ్చాలను తొలగించేందుకు ఫలవంతమైన చర్చలు జరిగాయని కువైట్ తరపున వెలువడిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇతర దేశాల నుంచి కూడా సానుకూల స్పందన కనిపించటం స్వాగతించదగిన విషయమన్నారు. నాగరికత పరంగా, ఆర్ధికంగా, రాజకీయంగా గల్ఫ్ దేశాలతో భారత్ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని...జీసీసీ దేశాల అంతర్గత పొరపొచ్చాలు త్వరలోనే సమసిపోతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com