కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం తప్పనిసరేం కాదు..ప్రజలకు సౌదీ స్పష్టత
- December 12, 2020
రియాద్:కోవిడ్ 19కి విరుగుడుగా అందుబాటులోకి వచ్చిన ఫైజర్-బయోన్టెక్ వ్యాక్సిన్ అందరూ ఖచ్చితంగా తీసుకోవాలని తామేం నిబంధనలు పెట్టడం లేదని సౌదీ అరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. స్వచ్ఛదంగా ముందుకు వచ్చిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించింది. అయితే ఆరోగ్య శాఖ సిబ్బంది మరీ ముఖ్యంగా కోవిడ్ పేషెంట్లను ట్రీట్ చేసే వారు మాత్రం వ్యాక్సిన్ వేయించుకోటం శ్రేయస్కరమని అభిప్రాయపడింది. సౌదీ ఆహార, ఔషధ నియంత్రణ అధికార విభాగం..గత వారమే ఫైజర్ వ్యాక్సిన్ ఆమోదం తెలుపటంతో అతి త్వరలోనే కింగ్డమ్ కు వ్యాక్సిన్ చేరే అవకాశాలు ఉన్నాయి. అయితే..వ్యాక్సిన్ రాగానే ప్రజలకు ఇవ్వబోమని..ప్రతీ బ్యాచ్ లో వ్యాక్సిన్ ను ముందుగా పూర్తిగా విశ్లేషించిన తర్వాతే ఇస్తామని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఫైజర్ వ్యాక్సిన్ సురక్షితమని చెప్పటంలో తమకు ఎలాంటి అనుమానం లేదని, అయితే..ప్రజల్లో మాత్రం వ్యాక్సిన్ దుష్ఫ్రభావాలకు దారితీస్తుందనే ఆందోళన ఉన్నమాట నిజమేనని వెల్లడించింది. అందుకే ప్రజలకు నమ్మకం కలిగిలే ముందుగానే ప్రతి బ్యాచ్ లో వ్యాక్సిన్ శాంపిల్ ను పరిశీలిస్తామని వివరించింది. అంతేకాదు...ఏడాదికి ముందు వ్యాక్సిన్ కు సంబంధించి క్లినికల్ ట్రయల్స్, సైడ్ ఎఫెక్ట్స్, తుది ఆమోదం గురించి సాధారణ ప్రజలకు తెలిసేది కాదని వెల్లడించింది. కానీ, కోవిడ్ నేపథ్యంలో వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్, వ్యాక్సిన్ వివరాలపై ప్రజలకు పూర్తి అవగాహన ఉందని తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష