ఈనెల 17న మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
- December 13, 2020బెంగుళూరు:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 17న పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈనెల 17 మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు పీఎస్ఎల్వీ – సీ50 రాకెట్ ద్వారా 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్-01 అనే ఉపగ్రహన్ని నింగిలోకి పంపనుంది. ఈమేరకు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం చేసిన దృశ్యాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది.
ఈ ఉపగ్రహం ప్రయోగించిన అనంతరం మొదట 18వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూబదిలీ కక్ష నుంచి 36వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. సీఎంఎస్ భారతదేశపు 42వ కమ్యూనికేషన్ ఉప్రగహం. ఈ సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవలను అందించేందుకు నిర్దేశించారు. ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం వల్ల భారత్తో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్ష్యదీప్లకు మెరుగైనా బ్రాడ్ బ్యాండ్ సేవలు అంతరాయం లేకుండా అందించవచ్చు. ఈ ఉపగ్రహం ఏడు సంవత్సరాల పాటు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తుంది. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్లో ఇది 22వ ప్రయోగం అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిషన్ అని కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు