దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- May 20, 2024
యూఏఈ: దుబాయ్ని సైకిల్-ఫ్రెండ్లీ సిటీగా మార్చాలనే తపనతో రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) సైకిళ్లు, స్కూటర్లు మరియు పాదచారులకు అనుగుణంగా ట్రాక్ను నిర్మించడానికి సిద్ధమైంది. అల్ సుఫౌహ్ను దుబాయ్ హిల్స్ను హెస్సా స్ట్రీట్ ద్వారా లింక్ చేసే ఈ కొత్త ట్రాక్, షేక్ జాయెద్ రోడ్ మరియు అల్ ఖైల్ రోడ్లను దాటే రెండు వంతెనలను నిర్మించనున్నారు. మల్టీ-వినియోగ ట్రాక్ 13.5 కి.మీ పొడవు, 4.5 మీటర్ల వెడల్పు (సైక్లిస్ట్లు & స్కూటర్ రైడర్లకు 2.5 మీటర్ల వెడల్పు ట్రాక్, పాదచారులకు 2 మీటర్ల వెడల్పు గల ట్రాక్) నిర్మిస్తారు. ఇది అల్ బార్షా మరియు అల్ బార్షా హైట్స్ వంటి కీలకమైన రహదారుల గుండా 12 విభిన్న నివాస, వాణిజ్య మరియు విద్యా ప్రాంతాలకు సేవలు అందించనుంది. "సైక్లిస్టులు, స్కూటర్ రైడర్లు మరియు పాదచారుల కోసం నిర్దేశించిన ఈ ట్రాక్ హెస్సా స్ట్రీట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్లో భాగం" అని ఆర్టీఏ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ చైర్మన్, డైరెక్టర్ జనరల్ మత్తర్ అల్ టేయర్ అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







