ఈనెల 17న మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
- December 13, 2020
బెంగుళూరు:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 17న పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈనెల 17 మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు పీఎస్ఎల్వీ – సీ50 రాకెట్ ద్వారా 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్-01 అనే ఉపగ్రహన్ని నింగిలోకి పంపనుంది. ఈమేరకు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం చేసిన దృశ్యాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది.
ఈ ఉపగ్రహం ప్రయోగించిన అనంతరం మొదట 18వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూబదిలీ కక్ష నుంచి 36వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. సీఎంఎస్ భారతదేశపు 42వ కమ్యూనికేషన్ ఉప్రగహం. ఈ సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవలను అందించేందుకు నిర్దేశించారు. ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం వల్ల భారత్తో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్ష్యదీప్లకు మెరుగైనా బ్రాడ్ బ్యాండ్ సేవలు అంతరాయం లేకుండా అందించవచ్చు. ఈ ఉపగ్రహం ఏడు సంవత్సరాల పాటు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తుంది. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్లో ఇది 22వ ప్రయోగం అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిషన్ అని కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









