ఈనెల 17న మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
- December 13, 2020
బెంగుళూరు:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. ఈ నెల 17న పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం చేసేందుకు రంగం సిద్ధం చేసింది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం చేపట్టనుంది. ఈనెల 17 మధ్యాహ్నం 3 గంటల 41 నిమిషాలకు పీఎస్ఎల్వీ – సీ50 రాకెట్ ద్వారా 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్-01 అనే ఉపగ్రహన్ని నింగిలోకి పంపనుంది. ఈమేరకు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్లో రాకెట్ అనుసంధానం చేసిన దృశ్యాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది.
ఈ ఉపగ్రహం ప్రయోగించిన అనంతరం మొదట 18వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూబదిలీ కక్ష నుంచి 36వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న భూస్థిర కక్షలోకి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రవేశపెడతారు. సీఎంఎస్ భారతదేశపు 42వ కమ్యూనికేషన్ ఉప్రగహం. ఈ సీఎంఎస్-01 ఫ్రీక్వెన్సీ స్పెక్ర్టంలో విస్తరించిన సీ బ్యాండ్ సేవలను అందించేందుకు నిర్దేశించారు. ఈ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రం వల్ల భారత్తో పాటు అండమాన్ నికోబార్ దీవులు, లక్ష్యదీప్లకు మెరుగైనా బ్రాడ్ బ్యాండ్ సేవలు అంతరాయం లేకుండా అందించవచ్చు. ఈ ఉపగ్రహం ఏడు సంవత్సరాల పాటు కక్షలో తిరుగుతూ సేవలు అందిస్తుంది. పీఎస్ఎల్వీ సీ-50 ఎక్స్ఎల్ సిరీస్లో ఇది 22వ ప్రయోగం అని ఇస్రో తెలిపింది. అంతేకాకుండా షార్ నుంచి ఇది 77వ మిషన్ అని కూడా వెల్లడించింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







