వదిలివేయబడ్డ వాహనాల ఆక్షన్
- December 14, 2020
మస్కట్:వదిలివేయబడ్డ వాహనాల్ని జనరల్ పబ్లిక్, అమెరాత్లోని బలాదియా యార్డ్లో పరీక్షించుకోవచ్చని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. పలు రకాల ఉల్లంఘనల నేపథ్యంలో వాహనాల్ని స్వాధీనం చేసుకోవడం లేదా సివిక్ అథారిటీ ద్వారా బలవంతంగా తరలించిన వాహనాల్ని ఇక్కడ డంప్ చేయడం జరిగింది. ఆయా వాహనాల విషయమై యజమానులు ముందుకు రాని పక్షంలో, వాటిని ఆక్షన్ వేసే అవకాశం వుంటుంది. డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య వాహనాల్ని పరిశీలించి, తమ ఆలోచనల మేరకు ఏదన్నా వాహనాన్ని కొంత మొత్తం చెల్లించి సొంతం చేసుకోవచ్చు. ఆక్షన్ వేయబడే ప్రాంతంలోకి ప్రవేశించేందుకు 4 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి వుంటుంది. ఇది తిరిగి చెల్లించబడదు. ఆక్షన్లో పాల్గొనేందుకు తిరిగి చెల్లించే వీలున్న 500 ఒమన్ రియాల్స్ చెల్లించాల్సి వుంటుంది. సక్సెస్ఫుల్ బిడ్డింగ్ తర్వాత మొత్తం సొమ్ముతోపాటు, 3 శాతం ప్రమోషనల్ ఛార్జీలు చెల్లించాలి. ఆక్షన్ పూర్తయ్యాక 10 రోజుల్లోగా ఓనర్షిప్ బదలాయించబడుతుంది. ఆలస్యం చేస్తే రోజుకి 50 ఒమన్ రియాల్స్ ఛార్జీ వుంటుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







