మోదీ ఈరోజు నేపాల్‌ ప్రధానికి విందు

- February 20, 2016 , by Maagulf
మోదీ ఈరోజు నేపాల్‌ ప్రధానికి విందు

భారత్‌ పర్యటనకు విచ్చేసిన నేపాల్‌ ప్రధానమంత్రి కే.పీ శర్మ ఓలికి రాష్ట్రపతి భవన్‌ వద్ద ఘన స్వాగతం లభించింది. గత అక్టోబరులో నేపాల్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కే.పీ శర్మ తొలి విదేశీ పర్యటనలో భాగంగా భారత్‌ చేరుకున్నారు. స్వాగత కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మస్వరాజ్‌, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, తదితరలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుష్మాస్వరాజ్‌ నేపాల్‌ ప్రధాని కేపీ శర్మతో సమావేశమయ్యారు. అనంతరం హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధాని మోదీతో భేటీ అవుతారు.ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. మోదీ ఈరోజు నేపాల్‌ ప్రధానికి విందు ఇవ్వనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com