మనీ లాండరింగ్, కమర్షియల్ ఫ్రాడ్: ఇద్దరికి జైలు
- December 14, 2020
సౌదీ: జెద్దా క్రిమినల్ కోర్టు ఓ బిజినెస్ ఓనర్ అలాగే ఓ ఉద్యోగికి మొత్తం 9 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. మనీ లాండరింగ్ అలాగే యాంటీ బిజినెస్ లైసెన్సింగ్ ఫ్రాడ్ నేపథ్యంలో నిందితులకు ఈ శిక్ష విధించడం జరిగింది. కాగా, 28 మిలియన్ రియాల్స్ని స్వాధీనం చేసుకునేలా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. సౌదీ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, ఓ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ తాలూకు బ్యాంక్ అకౌంట్పై నిఘా వుంచింది. జనరల్ కస్టమ్స్ అథారిటీ ద్వారా సదరు సంస్థకి చెందిన ఇంపోర్ట్స్ వాల్యూమ్ గురించిన సమాచారం సేకరించడం జరిగింది. ఈ క్రమంలో సదరు బ్యాంక్ అకౌంట్ ద్వారా బ్రోకరేజ్ చేస్తున్నట్లు గుర్తించారు అధికారులు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్రైమ్, లోతైన విచారణ చేసి, నిందితుల్ని న్యాయస్థానం ముందుంచడం జరిగింది.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









