కువైట్‌ ఏవియేషన్‌ ప్రెసిడెంట్‌తో రాయబారి శిబి జార్జి భేటీ

- December 14, 2020 , by Maagulf
కువైట్‌ ఏవియేషన్‌ ప్రెసిడెంట్‌తో రాయబారి శిబి జార్జి భేటీ

కువైట్‌లో భారత రాయబారి అయిన శిబి జార్జి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ సల్మాన్‌ అల్‌ హమౌద్‌ అద్‌ సబాహ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబందాలు, ద్వైపాక్షిక సహకారం, సివిల్‌ ఏవియేషన్‌ రంగంలో పరస్పర అవగాహన, ఒప్పందాలు వంటి విషయాలు చర్చకు వచ్చాయి. కాగా, కువైట్‌ 31 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించిన విషయం విదితమే. ఇందులో ఇండియా కూడా వుంది. అయితే, గత వారం మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు దేశంలోకి ఎంట్రీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో సర్క్యులర్‌ ద్వారా ప్రైవేటు సెక్టార్‌లోని మెడికల్‌ స్టాప్‌కి వెసులుబాటు కల్పించారు. అయితే, పెద్ద సంఖ్యలో ఇంకా వలస కార్మికులు, ఆయా దేశాల్లో ఎదురుచూస్తున్నారు, కువైట్‌ నుంచి వెసులుబాటు కోసం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com