17న భారత్-బంగ్లా ప్రధానుల వర్చువల్ సమావేశం
- December 14, 2020
న్యూఢిల్లీ: ఈనెల 17న ప్రధాని నరేంద్రమోడి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో భేటీ కానున్నారు. వర్చువల్ పద్ధతిలో ఈ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా నేతలిద్దరూ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సమగ్రమైన చర్చ జరుపనున్నారు. వివిధ రంగాల్లో పరస్పర సహకారానికి సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకోనున్నారు. కొవిడ్ అనంతరం రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఈ భేటీకి సంబంధించిన సమాచారాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







