రేపు దుబాయ్ లో జరగనున్న వాహన రహిత దినోత్సవం
- February 20, 2016
దుబాయ్ లో ఫిబ్రవరి 21వ తేదీన ( రేపు ) జరగనున్న వాహన రహిత దినోత్సవంలో స్థానికులు వెయ్యి కంపెనీలు, వివిధ సంస్థల కార్మికులు పాల్గొననున్నారు, వీరంతా తమకు చెందిన వాహనాలను ఇళ్ళ వద్దనే నిలిపి ప్రత్యమ్నాయ పద్ధతులలో పర్యావరణానికి హాని కాకుండా ఈ రోజును గడుపుతారు. ఈ చర్య ప్రపంచానికి ఎమిరేట్ పర్యావరణానికి అనుకూలమైన ప్రధమ స్థాన దేశంగా మార్చేందుకు కృషి చేస్తున్నారు. 7వ దఫా జరిగే ఈ వాహన రహిత దినోత్సవంకు ఒక ప్రేత్యేకత ఉంది. గత ఏడాది ఈ కార్యక్రమంలో 300 సంస్థలు, 30 వేలమంది ప్రజలు తమ తమ కార్లకు పూర్తి విశ్రాంతిని ఇచ్చి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది అంతకన్నా రెట్టింపు సంఖ్యలో ప్రజలు పాల్గొనవచ్చని, అంచనా వేస్తున్నారు. వాహన రహిత దినోత్సవం ద్వారా ఒక్కరోజులో 140 టన్నుల కార్బన్ డయాక్సైడ్ , 147,000 లీటర్ల ఇంధనం పొదుపు అవుతుంది. ఈ ప్రభావం ఎంతోకొంత పర్యావరణానికి మేలు చేసినట్లువుతుందని ఈ కార్యక్రమ నిర్వాహకులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు







