విమాన సిబ్బందిని కోవిడ్ వారియర్స్గా గుర్తించండి-IATA
- December 16, 2020
న్యూ ఢిల్లీ:విమానయాన రంగంలో పనిచేసే సిబ్బందిని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్గా గుర్తించాలని ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రపంచ దేశాలను కోరింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో విమాన సిబ్బందిని సైతం కరోనా వారియర్స్గా పరిగణించాలని కోరింది. వ్యాక్సిన్ను దేశదేశాలకు సరఫరా చేసేందుకు 8 వేల బోయింగ్ 747 విమానాలు అవసరం కానున్నాయని, వ్యాక్సిన్ తరలింపునకు వేలాది మంది విమాన సిబ్బంది అవసరమైతారని అసోసియేషన్ సీఈఓ జునిక్ తెలిపారు. ప్రపంచానికి వ్యాక్సిన్ సరఫరాలో కీలకం కానున్న నేపథ్యంలోనే విమాన సిబ్బందిని కోవిడ్ వారియర్స్గా పరిగణించాలని కోరారు. కాగా ది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వ్యాక్సిన్ తరలింపు విషయంలో వర్డల్ హెల్త్ ఆర్గనైజేషన్తో కలిసి పని చేయనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







