రద్దయిన, సరిగ్గా పూర్తికాని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల కోసం కమిటీ
- December 16, 2020
దుబాయ్:పూర్తిస్థాయిలో పూర్తికాని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, రద్దయిన ప్రాజెక్టులకు సంబంధించి దుబాయ్, ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తోంది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ జారీ చేసిన ఓ డిక్రీని జారీ చేశారు. ఈ నేపథ్యంలో దుబాయ్ జ్యుడీషియల్ కౌన్సిల్ ఛైర్మన్, కొత్త స్పెషల్ రటైబ్యునల్కి సంబంధించి ఛైర్మన్ అలాగే మెంబర్స్ని నియమిస్తారు. ఈ కమిటీ, ఆయా నిర్మాణాల పరిస్థితిని అధ్యయనం చేసి, తగు చర్యలు చేపడుతుంది. ఒకవేళ నిర్మాణదారుడు, నిబంధనలకు లోబడి ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోతే, వినియోగదారులకు పూర్తిగా వారు చెల్లించిన సొమ్ముని తిరిగి ఇచ్చేయాల్సి వుంటుంది. డిక్రీలోని మరో నిబంధన ప్రకారం, రద్దయిన, సరిగ్గా పూర్తికాని ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి కేసుల్నీ విచారణకు స్వీకరించకూడదు. వివాదాల పరిష్కారంలో ట్రైబ్యునల్కి రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పూర్తిస్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు