బహుముఖ ప్రజ్ఞాశాలి డా.మృణాళినికి డా.వాసిరెడ్డి సీతాదేవి వంశీ జాతీయ పురస్కారం
- December 16, 2020
హైదరాబాద్:డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి వంశీ గ్రంధాలయం,వంశీ ఇంటర్నేషనల్ ఇండియా వ్యాలీ వేదిక అమెరికా,శారదా కళాసమితి విజయవాడ సంయుక్త ఆధ్వర్యంలో బహుముఖ ప్రజ్ఞాశాలి, డాక్టర్ మృణాళిని కి డా.వాసిరెడ్డి సీతాదేవి వంశీ - జాతీయ సాహితీ పురస్కారం - 2020 డిసెంబర్ 15వ తేదీన అంతర్జాలంలో ప్రదానం చేస్తూ ముఖ్య అతిథిగా పాల్గొన్న డా కె వి రమణ సలహాదారులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ " అనేక దేశాలలో పర్యటించి సాహిత్య సదస్సులలో పాల్గొని సిద్ధాంత పత్రాలు సమర్పించారనీ, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా దీటుగా మాట్లాడగలరని, మృణాళిని కి తనచేతులమీదుగా వాసిరెడ్డి సీతాదేవి నెలకొల్పిన పురస్కారం అందజేయడం తనకు గర్వంగా ఉందని అన్నారు..సాహితీ పరివ్యాప్తి ఎంత ఉందో అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీ ఎంత ఉందో వారికి అంతే ఉందని ప్రశంసించారు.. 1982 లో ఆమె రాసిన "మరీచిక" నవలను అప్పటి ప్రభుత్వం నిషేధించిందనీ, నిషేధించిన నవలా రచయిత్రిగా ఆమె పేరెన్నిక కలిగి ఉన్నారని, అధికారంలో ఉన్నంత కాలం ఇతరులకు ఎంత సాయం చేయాలని ఆలోచించిన మహిళావిదుషీమణి అని కొనియాడారు..."
వంశి వ్యవస్థాపక అధ్యక్షులు శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు మాట్లాడుతూ, 1972 నుంచి వంశీ సంస్థ కు, వాసిరెడ్డి సీతాదేవి గారితో ఉన్న అనుబంధం తెలియజేస్తూ పురస్కారాలకు దూరంగా ఉండే మృణాళిని, వాసిరెడ్డి సీతాదేవి అవార్డు స్వీకరించడం ఎంతో హర్షణీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి నారాయణరావు జ్యోతి ప్రకాశనం చేశారు.. ప్రముఖ రచయిత్రులు డా. ముక్తేవి భారతి, వోల్గా, జలంధర చంద్రమోహన్, శారదా కళా సమితి అధ్యక్షులు డోగిపర్తి శంకర్రావు, వంశీ అధ్యక్షురాలు డా తెన్నేటి సుధాదేవి, మేనేజింగ్ ట్రస్టీ సుంకర పల్లి శైలజ ,వ్యాలీ వేదిక వ్యవస్థాపకురాలు శారదా కాశీ వఝుల పాల్గొన్నారు.
సభలో రాధికా నోరి, రమా కంచి భట్ల ఆస్ట్రేలియా,ప్రియాంక మార్గాని, ఆస్ట్రేలియా,ఉషా చినుకుల ఆస్ట్రేలియా, లక్ష్మి శ్రీనివాస్ రామరాజు గుంటూరు, రామాంతపూర్ పబ్లిక్ స్కూల్ యాక్టివిటీ కాప్టెన్ అనఘాదత్త రామరాజు పాల్గొన్నారు..పాడనా తెలుగు పాట సంగీత విభావరి కార్యక్రమం ఆద్యంతం అందరినీ అలరించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







