ఆఫ్గనిస్తాన్ లో భారీ పేలుళ్లు, 15 మంది మృతి
- December 18, 2020
ఆఫ్గనిస్తాన్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 15 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన ఆఫ్ఘన్ లోని ఘాజీ ప్రావిన్స్ లోని గెలాన్ జిల్లాలో జరిగింది. గెలాన్ జిల్లాలోని ఓ ఇంట్లో కొంతమంది వ్యక్తులు గుమిగూడి ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లు సంభవించాయి. పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉన్న సమయంలో పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రమాదవశాత్తు పేలుళ్లు జరిగాయా లేదంటే, ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారా అనే దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్గనిస్తాన్ లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ ఎలాంటి పేలుళ్లు జరుగుతాయో అని ప్రజలు భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







