ఆఫ్గనిస్తాన్ లో భారీ పేలుళ్లు, 15 మంది మృతి
- December 18, 2020
ఆఫ్గనిస్తాన్ లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో 15 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన ఆఫ్ఘన్ లోని ఘాజీ ప్రావిన్స్ లోని గెలాన్ జిల్లాలో జరిగింది. గెలాన్ జిల్లాలోని ఓ ఇంట్లో కొంతమంది వ్యక్తులు గుమిగూడి ఉన్నారు. ఆ సమయంలో పేలుళ్లు సంభవించాయి. పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉన్న సమయంలో పేలుళ్లు సంభవించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రమాదవశాత్తు పేలుళ్లు జరిగాయా లేదంటే, ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారా అనే దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆఫ్గనిస్తాన్ లో గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఎక్కడ ఎలాంటి పేలుళ్లు జరుగుతాయో అని ప్రజలు భయపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







