కొత్త కరోనా వైరస్:బోర్డర్స్ని మూసేసిన కువైట్
- December 21, 2020
కువైట్ సిటీ:నేటి నుండి జనవరి 1వ తేదీ వరకు అంతర్జాతీయ వాణిజ్య విమానాల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కనుగొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.రోడ్డు అలాగే సముద్రపు బోర్డర్స్ని కూడా మూసివేసినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి తారిఖ్ అల్ ముజ్రిమ్ తెలిపారు. అత్యవసర విభాగాలకు సంబంధించి అంతర్జాతీయ ప్రయాణాలకు మాత్రం కాస్త వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ నిషేధం ఇంకో వారం పొడిగించే అవకాశాలు కూడా వున్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ దేశాల నుంచీ అలాగే కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన దేశాల నుంచి వచ్చినవారి కోసం ప్రత్యేకంగా కొన్ని నిబంధనల్ని జారీ చేశారు.డిసెంబర్ 8 తర్వాత వచ్చినవారు రెండు వారాల పాటు స్వీయ నిర్బంధంలో వుండాల్సి వుంటుంది. ప్రతి ఐదు రోజుల తర్వాత వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు









