నరేంద్ర మోదీకి అమెరికా అత్యున్నత పురస్కారం
- December 22, 2020అమెరికా:ప్రధాని మోదీకి అమెరికా అత్యున్నత పురస్కారం’ లీజియన్ ఆఫ్ మెరిట్’ ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందజేశారు. భారత-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయడంలో మోదీ నాయకత్వ ప్రతిభ అసమానమని ఆయన అన్నారు. కేవలం ఓ ప్రభుత్వ అధినేతకు మాత్రమే చీఫ్ కమాండ్ ఆఫ్ ది లీజియన్ అవార్డును అందజేస్తారు. గ్లోబల్ పవర్ లో ఇండియా అత్యున్నత శక్తిగా ఎదుగుతోందని, ప్రపంచ సవాళ్ళను ఎదుర్కోవడంలో ఉభయ దేశాల మధ్య వ్యూహాత్మక పెంపొందించేందుకు మోదీ చేస్తున్న కృషి అపారమని పేర్కొన్నారు. అమెరికాలో భారత రాయబారి తరన్ జిత్ సింగ్ సంధు వైట్ హౌస్ లో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓ బ్రీన్ నుంచి స్వీకరించారు. మీ నాయకత్వానికి ఇది గుర్తింపు అని ట్రంప్ అన్నట్టు రాబర్ట్ ట్వీట్ చేశారు.
కాగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు కూడా ఈ పురస్కారాలు లభించాయి. ఆ యా దేశాల రాయబారులు వీటిని అందుకున్నారు. భారత ప్రధానికి ఇలా అవార్డు అందజేసిన దేశాల్లో అమెరికా తాజా దేశమైంది. 2016 లో సౌదీ అరేబియా ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్, అదే సంవత్సరంలో ఘాజీ ఆమిర్ అమానుల్లాఖాన్ స్టేట్ ఆర్డర్, 2018 లో గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు. 2019 లో యూఏఈ ఆర్డర్ ఆఫ్ ది జాయెర్ అవార్డు. అదే ఏడాది రష్యా ఆర్డర్ ఆఫ్ ఎండ్రు పురస్కారంతో బాటు ఆ సంవత్సరంలోనే మాల్దీవుల అత్యున్నత పురస్కారం కూడా లభించింది.
తాజా వార్తలు
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష