ఏపీ:ఆన్లైన్ యాప్ వేధింపులపై తొలి కేసు నమోదు
- December 22, 2020
అమరావతి:ఆన్లైన్ యాప్ వేధింపులపై ఏపీలో తొలి కేసు నమోదైంది. వడ్డీ చెల్లింపులో కాస్త ఆలస్యమైనందుకు.. గుంటూరుకు చెందిన దుర్గ అనే మహిళను యాప్ నిర్వాహకులు హడలెత్తించారు. అవసరాలరీత్యా.. కొన్ని యాప్స్ ద్వారా లోన్ తీసుకున్నారు దుర్గ. సకాలంలో రుణం చెల్లించలేకపోయారు. దీంతో నిర్వాహకుల నుంచి వేధింపులు అధికమయ్యాయి. ఫోన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ల జాబితా కాపీ చేసి ఆమెకే పంపారు. ఆ జాబితా చూసిన దుర్గ షాక్ అయ్యారు. లోన్ తీసుకొని ఎగ్గొట్టారని ఫోన్లోని కాంటాక్ట్ నెంబర్లన్నింటికీ మెసేజ్లు పంపుతామని బెదిరించారు. ఒకవేళ ఫోన్ స్విచ్చాఫ్ చేసినా వారందరికీ మెసేజ్లు పంపుతామని హెచ్చరించారు. వేధింపులు తట్టుకోలేక ఒకానొక దశలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీ అయ్యారు దుర్గ. చివరి ప్రయత్నంగా గుంటూరు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయానికి వచ్చిన సమయంలో కూడా లోన్ నిర్వాహకుల నుంచి దుర్గకు రెండు ఫోన్లు వచ్చాయి. దీంతో యాప్ నిర్వాహకుల నుంచి రక్షణ కల్పించాలని ఎస్పీని వేడుకున్నారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









