రేపు రాష్ట్రపతిని కలవనున్న రాహుల్ గాంధీ
- December 23, 2020
న్యూ ఢిల్లీ:రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సేకరించిన 2 కోట్ల సంతకాలతో ఓ మెమోరాండం ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి అందజేయనున్నారు. తమ పార్టీ ఎంపీలతో కలిసి ఆయన కాలినడకన రాష్ట్రపతి భవన్ కు వెళ్లనున్నారు.కేంద్రం తెచ్చిన ఈ చట్టాల రద్దు విషయంలో జోక్యం చేసుకొవాలని రాష్ట్రపతిని అభ్యర్థించనున్నారు. ఇప్పటికే నిరసనలు, ఆందోళనల సందర్భంగా 44 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, ఈ చట్టాలు అన్నదాతలకు తీవ్ర నష్టం కలిగించేవిగా ఉన్నాయని ఈ మెమొరాండంలో పేర్కొన్నట్టు కాంగ్రెస్ నేత కేసీ, వేణుగోపాల్ తెలిపారు. రైతులతో రాజీ కుదుర్చుకుంటున్న రీతిలో కేంద్రం అన్నదాతలను మోసగిస్తోందని, కార్పొరేట్ సంస్థల బాగు కోసమే ఈ చట్టాలను తెచ్చిందని ఆయన ఆరోపించారు. పైగా వీటి విషయంలో తప్పుడు ప్రచారం చేస్తోందని, రైతాంగాన్ని అవమానపరుస్తోందని వేణుగోపాల్ అన్నారు. తమ పార్టీ దేశ వ్యాప్తంగా సేకరించిన 2 కోట్ల సంతకాలతో కూడిన ఈ మెమోరాండం ను రాష్ట్రపతికి అందజేస్తున్నామన్నారు.
దాదాపు రెండు వారాల క్రితం కూడా రాహుల్ గాంధీ ఆధ్వర్యాన ఎన్సీపీ నేత శరద్ పవార్, సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత డీ.రాజా, డీఎంకే నాయకుడు ఇళంగోవన్ లతో కూడిన ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలిసి .. రైతు చట్టాల రద్దు విషయంలో జోక్యం చేసుకోవాలంటూ ఓ వినతిపత్రాన్ని సమర్పించింది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







