టర్కీలో బయటపడ్డ 99 టన్నుల బంగారం నిధి...
- December 25, 2020
టర్కీ:ప్రపంచంలో విలువైన మూలకాల్లో బంగారం కూడా ఒకటిగా మారింది.దీంతో బంగారం నిక్షేపాల కోసం అన్ని దేశాలు నిత్యం పరిశోధన చేస్తూనే ఉన్నాయి. అయితే, టర్కీలో బంగారం నిక్షేపాల నిధి బయటపడింది.ఈ నిధిలో 99 టన్నుల బంగారం విలువ 6 బిలియన్ డాలర్లు(రూ.44,139 కోట్లు) ఉండొచ్చని నిపుణులు పేర్కొన్నారు.టర్కీలోని సోగుట్ సెంట్రల్ వెస్ట్ ప్రాంతంలో నిధిని కనుగొన్నారు.వ్యవసాయ క్రెడిట్ కోఆపరేటివ్స్ , గుబ్రేటాస్ ఎరువుల ఉత్పత్తి సంస్థ (Gubretas Fertilizers) చీఫ్ ఫహ్రెటిన్ పోయరాజ్ ఈ బంగారం నిధిని గుర్తించారు.
రాబోయే రెండేళ్లలో ఈ బంగారాన్ని తవ్వితీస్తామని ఫహ్రెటిన్ పోయ్రాజ్ అన్నారు. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బంగారు నిధి బటయపడిందన్న వార్తలతో గుబ్రేటాస్ షేర్ ధరలు 10 శాతం మేర ఎగబాకాయి.
టర్కీలో ఈ ఏడాది 38 టన్నుల బంగారం ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. దాన్ని 100 టన్నులకు పెంచడమే తమ లక్ష్యమని సెప్టెంబరులో ఇంధన సహజ వనరుల మంత్రి ఫాతిహ్ డోన్మెజ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ అధ్యక్షుడి స్వాగతం
- రియాద్లో ఘనంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో 5 రోజుల వర్షాలు..ఆరెంజ్ అలర్ట్
- ఏపీలో రేపటి నుండి ఎన్టీఆర్ వైద్యసేవలు బంద్!
- సైబర్ నేరాల నియంత్రణలో బ్యాంకర్లదే కీలక పాత్ర: సీపీ సజ్జనార్
- ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్
- పార్టనర్షిప్ బలోపేతానికి సౌదీ అరేబియా, కెనడా చర్చలు..!!
- జెరూసలేంలో ఇజ్రాయెల్ ఆంక్షలు..ఖండించిన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- దుబాయ్ లో కువైట్ ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి..!!
- ఒమన్ పై ద్రోణి ఎఫెక్ట్..రెండు రోజులపాటు వర్షాలు..!!









