టర్కీలో బయటపడ్డ 99 టన్నుల బంగారం నిధి...
- December 25, 2020
టర్కీ:ప్రపంచంలో విలువైన మూలకాల్లో బంగారం కూడా ఒకటిగా మారింది.దీంతో బంగారం నిక్షేపాల కోసం అన్ని దేశాలు నిత్యం పరిశోధన చేస్తూనే ఉన్నాయి. అయితే, టర్కీలో బంగారం నిక్షేపాల నిధి బయటపడింది.ఈ నిధిలో 99 టన్నుల బంగారం విలువ 6 బిలియన్ డాలర్లు(రూ.44,139 కోట్లు) ఉండొచ్చని నిపుణులు పేర్కొన్నారు.టర్కీలోని సోగుట్ సెంట్రల్ వెస్ట్ ప్రాంతంలో నిధిని కనుగొన్నారు.వ్యవసాయ క్రెడిట్ కోఆపరేటివ్స్ , గుబ్రేటాస్ ఎరువుల ఉత్పత్తి సంస్థ (Gubretas Fertilizers) చీఫ్ ఫహ్రెటిన్ పోయరాజ్ ఈ బంగారం నిధిని గుర్తించారు.
రాబోయే రెండేళ్లలో ఈ బంగారాన్ని తవ్వితీస్తామని ఫహ్రెటిన్ పోయ్రాజ్ అన్నారు. ఇది టర్కీ ఆర్థిక వ్యవస్థకు బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. బంగారు నిధి బటయపడిందన్న వార్తలతో గుబ్రేటాస్ షేర్ ధరలు 10 శాతం మేర ఎగబాకాయి.
టర్కీలో ఈ ఏడాది 38 టన్నుల బంగారం ఉత్పత్తి చేసి రికార్డు సాధించింది. దాన్ని 100 టన్నులకు పెంచడమే తమ లక్ష్యమని సెప్టెంబరులో ఇంధన సహజ వనరుల మంత్రి ఫాతిహ్ డోన్మెజ్ తెలిపారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







