ఏపీలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు...

- December 26, 2020 , by Maagulf
ఏపీలో తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు...

అమరావతి:ఏపీలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది.  రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయాయి.  ప్రస్తుతం ఏపీలో 500 కంటే తక్కువగా కేసులు నమోదవుతున్నాయి.  పాజిటివ్ కేసులు తక్కువగా నమోదవుతున్నా, జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.  తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది.  ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 282 కరోనా కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,80,712 కి చేరింది.  ఇందులో 8,69,920 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,700 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.  ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఒక్కరు మృతి చెందారు.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతుల సంఖ్య 7092 కి చేరింది. 

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com