తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- December 27, 2020
హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రైతులకు సంబంధించిన రైతు బంధు ఆర్ధిక సాయం ప్రారంభించబోతున్నది. దీనికోసం మొత్తం రూ.7515 కోట్ల రూపాయలను రిలీజ్ చేసింది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేయబోతున్నారు. ఇక ఇదిలా ఉంటె, రైతు బంధు పధకంతో పాటుగా మరొక కీలక నిర్ణయం కూడా ప్రభుత్వం తీసుకున్నది. నియంత్రిత సాగు విధానంను ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు నచ్చిన పంట వేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో పంట కొనుగోలు కేంద్రాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు తెలిపింది. పంట కొనుగోలు ద్వారా ప్రభుత్వానికి దాదాపుగా రూ.7500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నది. రైతులు తమ పంటను ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చని, కేంద్ర చట్టాలు కూడా రైతులు పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని ప్రభుత్వం పేర్కొన్నది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- భక్తులకు TTD కీలక అలర్ట్..
- రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..
- వైజాగ్ లో ఇనార్బిట్ మాల్ ప్రారంభం..
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!









