తెలంగాణ లో కొత్తగా 205 కరోనా కేసులు
- December 28, 2020
హైదరాబాద్:తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది... ఆదివారం కోవిడ్ బులెటిన్లో దాదాపు 500 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆసంఖ్య అమాంతం తగ్గిపోయింది... తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మృతిచెందగా.. 551 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,068కు చేరుకోగా... కోలుకున్నవారి సంఖ్య 2,77,304కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్తో 1533 మంది మృతిచెందారు. దేశంలో కరోనా మరణాల శాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గిందని.. రివకరీ రేటు దస్త్రశంలో 95.8 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 97.27 శాతానికి పెరిగిందని ప్రభుత్వం ప ఏర్కొంది. అయితే, ఇవాళ ఉన్నట్టుండి కోవిడ్ కేసుల తగ్గిపోవడానికి ప్రధాన కారణం టెస్ట్ల సంఖ్య తగ్గడమేనని చెప్పుకోవాలి ఎందుకంటే.. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 37 వేలకు పైగా శాంపిల్స్ను పరీక్షించగా.. తాజా బులెటన్ ప్రకారం మాత్రం 27,244 శాంపిల్స్ మాత్రమే పరిశీలించారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోయింది.
-హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- రేపు అమర జ్యోతి ఉమేష్ చంద్ర—60వ జయంతి
- రామ్ చరణ్ బర్త్డేకు అర్థవంతమైన కానుక ఇచ్చిన చిరంజీవి
- ఉక్రెయిన్–సౌదీ అరేబియా మధ్య రక్షణ సహకార ఒప్పందం
- ఏప్రిల్ 25న కొత్త పార్టీ పేరు ప్రకటించనున్న కవిత
- సివిలియన్ రక్షణ పై ఫోకస్..!!
- ప్రపంచవ్యాప్తంగా మూడో స్థానంలో జెద్దా ఎయిర్పోర్ట్..!!
- భారీ వర్షాలు..నీట మునిగిన ఇళ్లు, కార్లు..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- ధోఫార్లో పోలీస్ ఏవియేషన్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్..!!









