తెలంగాణ లో కొత్తగా 205 కరోనా కేసులు
- December 28, 2020హైదరాబాద్:తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది... ఆదివారం కోవిడ్ బులెటిన్లో దాదాపు 500 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఇవాళ ఆసంఖ్య అమాంతం తగ్గిపోయింది... తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన కోవిడ్ తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 205 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మృతిచెందగా.. 551 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య 2,85,068కు చేరుకోగా... కోలుకున్నవారి సంఖ్య 2,77,304కు పెరిగింది. ఇక, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్తో 1533 మంది మృతిచెందారు. దేశంలో కరోనా మరణాల శాతం 1.4 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి తగ్గిందని.. రివకరీ రేటు దస్త్రశంలో 95.8 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 97.27 శాతానికి పెరిగిందని ప్రభుత్వం ప ఏర్కొంది. అయితే, ఇవాళ ఉన్నట్టుండి కోవిడ్ కేసుల తగ్గిపోవడానికి ప్రధాన కారణం టెస్ట్ల సంఖ్య తగ్గడమేనని చెప్పుకోవాలి ఎందుకంటే.. నిన్న రాష్ట్రవ్యాప్తంగా 37 వేలకు పైగా శాంపిల్స్ను పరీక్షించగా.. తాజా బులెటన్ ప్రకారం మాత్రం 27,244 శాంపిల్స్ మాత్రమే పరిశీలించారు. దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య కూడా తగ్గిపోయింది.
-హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు