ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- March 27, 2026
దోహా: GCC దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరికలను జారీ చేశారు
సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్లో తమ వాయు రక్షణ వ్యవస్థలు ఐదు డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, మేజర్ జనరల్ తుర్కి అల్ మాలికి ధృవీకరించారు.
ఖతార్ జాతీయ అత్యవసర హెచ్చరిక
ఖతార్ అత్యవసర సేవల విభాగం అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరికను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫోన్లకు తీవ్రమైన శబ్దంతో కూడిన హెచ్చరిక సందేశాలను పంపింది. గత వారం రోజుల్లో ఇటువంటి హెచ్చరిక జారీ కావడం ఇదే మొదటిసారి. ప్రజలు ఇళ్ల లోపలే ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే, కొన్ని నిమిషాల వ్యవధిలోనే, భద్రతా ముప్పు తొలగిపోయినట్లు మరో మెసేజ్ ను అన్ని ఫోన్లకు పంపినట్లు అధికారులు తెలిపారు.
కువైట్ లోని షువైఖ్ నౌకాశ్రయం పై డ్రోన్ల దాడి
కువైట్ నగరానికి సమీపంలో ఉన్న షువైఖ్ నౌకాశ్రయాన్ని ఈ ఉదయం డ్రోన్ దాడులు లక్ష్యంగా చేసుకున్నాయని కువైట్ నౌకాశ్రయ ప్రాధికార సంస్థ తెలిపింది. ఈ దాడి వల్ల భౌతికంగా నష్టాలు సంభవించాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
బహ్రెయిన్లో మోగిన సైరన్లు
బహ్రెయిన్ లో హెచ్చరిక సైరన్లు మోగించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పౌరులు మరియు నివాసితులు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అలాగే అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే తాజా సమాచారాన్ని ఫాలో కావాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









