ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- March 27, 2026
దోహా: GCC దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరికలను జారీ చేశారు
సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్లో తమ వాయు రక్షణ వ్యవస్థలు ఐదు డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, మేజర్ జనరల్ తుర్కి అల్ మాలికి ధృవీకరించారు.
ఖతార్ జాతీయ అత్యవసర హెచ్చరిక
ఖతార్ అత్యవసర సేవల విభాగం అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరికను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫోన్లకు తీవ్రమైన శబ్దంతో కూడిన హెచ్చరిక సందేశాలను పంపింది. గత వారం రోజుల్లో ఇటువంటి హెచ్చరిక జారీ కావడం ఇదే మొదటిసారి. ప్రజలు ఇళ్ల లోపలే ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే, కొన్ని నిమిషాల వ్యవధిలోనే, భద్రతా ముప్పు తొలగిపోయినట్లు మరో మెసేజ్ ను అన్ని ఫోన్లకు పంపినట్లు అధికారులు తెలిపారు.
కువైట్ లోని షువైఖ్ నౌకాశ్రయం పై డ్రోన్ల దాడి
కువైట్ నగరానికి సమీపంలో ఉన్న షువైఖ్ నౌకాశ్రయాన్ని ఈ ఉదయం డ్రోన్ దాడులు లక్ష్యంగా చేసుకున్నాయని కువైట్ నౌకాశ్రయ ప్రాధికార సంస్థ తెలిపింది. ఈ దాడి వల్ల భౌతికంగా నష్టాలు సంభవించాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
బహ్రెయిన్లో మోగిన సైరన్లు
బహ్రెయిన్ లో హెచ్చరిక సైరన్లు మోగించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పౌరులు మరియు నివాసితులు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అలాగే అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే తాజా సమాచారాన్ని ఫాలో కావాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







