ఖతార్, కువైట్, బహ్రెయిన్ అంతటా సెక్యూరిటీ అలెర్ట్స్ జారీ..!!
- March 27, 2026
దోహా: GCC దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగుతుండటంతో అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరికలను జారీ చేశారు
సౌదీ అరేబియా తూర్పు ప్రావిన్స్లో తమ వాయు రక్షణ వ్యవస్థలు ఐదు డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ విషయాన్ని మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి, మేజర్ జనరల్ తుర్కి అల్ మాలికి ధృవీకరించారు.
ఖతార్ జాతీయ అత్యవసర హెచ్చరిక
ఖతార్ అత్యవసర సేవల విభాగం అత్యున్నత స్థాయి భద్రతా హెచ్చరికను జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఫోన్లకు తీవ్రమైన శబ్దంతో కూడిన హెచ్చరిక సందేశాలను పంపింది. గత వారం రోజుల్లో ఇటువంటి హెచ్చరిక జారీ కావడం ఇదే మొదటిసారి. ప్రజలు ఇళ్ల లోపలే ఉండాలని, కిటికీలకు దూరంగా ఉండాలని సూచించారు. అయితే, కొన్ని నిమిషాల వ్యవధిలోనే, భద్రతా ముప్పు తొలగిపోయినట్లు మరో మెసేజ్ ను అన్ని ఫోన్లకు పంపినట్లు అధికారులు తెలిపారు.
కువైట్ లోని షువైఖ్ నౌకాశ్రయం పై డ్రోన్ల దాడి
కువైట్ నగరానికి సమీపంలో ఉన్న షువైఖ్ నౌకాశ్రయాన్ని ఈ ఉదయం డ్రోన్ దాడులు లక్ష్యంగా చేసుకున్నాయని కువైట్ నౌకాశ్రయ ప్రాధికార సంస్థ తెలిపింది. ఈ దాడి వల్ల భౌతికంగా నష్టాలు సంభవించాయని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది.
బహ్రెయిన్లో మోగిన సైరన్లు
బహ్రెయిన్ లో హెచ్చరిక సైరన్లు మోగించినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పౌరులు మరియు నివాసితులు ప్రశాంతంగా ఉండాలని, సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అలాగే అధికారిక మాధ్యమాల ద్వారా వచ్చే తాజా సమాచారాన్ని ఫాలో కావాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







