ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- March 27, 2026
కువైట్: ఈరోజు తెల్లవారుజామున శత్రు డ్రోన్లు మరియు క్రూయిజ్ క్షిపణులు ముబారక్ అల్-కబీర్ పోర్టు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని ప్రజా పనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పరిస్థితిని అత్యవసర ప్రతిస్పందన టీమ్ అదుపులోకి తీసుకువచ్చాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఈ దాడి వల్ల పోర్టు మౌలిక సదుపాయాలకు భౌతిక నష్టం వాటిల్లిందని ప్రాథమిక నివేదికలు సూచించాయి. కానీ ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని తెలిపింది.
షువైఖ్ పోర్టు పై అటాక్
షువైఖ్ పోర్టును శత్రు డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని, దీనివల్ల ఆస్తి నష్టం జరిగిందని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కువైట్ పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. ఈ మేరకు తన X లోని తమ అధికారిక ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపింది.ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం మౌలిక సదుపాయాలకే పరిమితమైందని, ఎవరూ గాయపడలేదని అథారిటీ తెలిపింది. సాధ్యమైనంత వరకు సాధారణ పోర్టు కార్యకలాపాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు
- వాహనాలకు పూర్తి నష్టం పేమెంట్స్..సౌదీ సెంట్రల్ బ్యాంక్ కీలక ఉత్తర్వులు..!!
- ఇరాన్, ఇరాక్లకు వెళ్లడం పై నిషేధం విధించిన బహ్రెయిన్..!!
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం









