ముబారక్ అల్-కబీర్ పోర్టు, షువైఖ్ పోర్టుల పై అటాక్స్..!!
- March 27, 2026
కువైట్: ఈరోజు తెల్లవారుజామున శత్రు డ్రోన్లు మరియు క్రూయిజ్ క్షిపణులు ముబారక్ అల్-కబీర్ పోర్టు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నాయని ప్రజా పనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పరిస్థితిని అత్యవసర ప్రతిస్పందన టీమ్ అదుపులోకి తీసుకువచ్చాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఈ దాడి వల్ల పోర్టు మౌలిక సదుపాయాలకు భౌతిక నష్టం వాటిల్లిందని ప్రాథమిక నివేదికలు సూచించాయి. కానీ ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదని తెలిపింది.
షువైఖ్ పోర్టు పై అటాక్
షువైఖ్ పోర్టును శత్రు డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని, దీనివల్ల ఆస్తి నష్టం జరిగిందని, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని కువైట్ పోర్ట్స్ అథారిటీ ప్రకటించింది. ఈ మేరకు తన X లోని తమ అధికారిక ఖాతాలో ఒక ప్రకటనలో తెలిపింది.ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం మౌలిక సదుపాయాలకే పరిమితమైందని, ఎవరూ గాయపడలేదని అథారిటీ తెలిపింది. సాధ్యమైనంత వరకు సాధారణ పోర్టు కార్యకలాపాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







