విశ్వక్సేన్ హీరోగా కొత్త చిత్రం ప్రారంభం
- December 28, 2020
హైదరాబాద్:టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు పీవీపీ సినిమా,శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకాలపై యంగ్ హీరో విశ్వక్సేన్ కథానాయకుడిగా కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. తమిళంలో సూపర్హిట్ అయిన ఓ మై కడవులే సినిమాకు ఇది రీమేక్. తమిళంలో ‘ఓ మై కడవులే’ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు అశ్వత్ మారిముత్తు తెలుగులోనూ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
ముహూర్తపు సన్నివేశానికి హిట్ చిత్రాల నిర్మాత దిల్రాజు క్లాప్ కొట్టగా, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ముహర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు అశ్వత్ మారిముత్తుకి దిల్రాజు స్క్రిప్ట్ను అందించారు. ఫిబ్రవరి మూడో వారం నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
బెస్ట్ డైలాగ్ రైటర్గా నేషనల్ అవార్డ్ను అందుకున్న డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి మాటలను అందించారు. గ్యారీ బీహెచ్ ఎడిటర్గా వర్క్ చేస్తున్నారు. త్వరలోనే హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలియజేసింది.
తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







