తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేసిన కుమారుడి అరెస్ట్
- December 28, 2020
కువైట్ సిటీ:తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. సల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధిత తల్లిదండ్రుల్లో తండ్రి వయసు 60 ఏళ్ళు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్ ద్వారా తన ఆవేదనను బాధిత తండ్రి వెల్లగక్కుకున్నారు. వెంటనే పోలీసులు బాధిత వ్యక్తి ఇంటికి వెళ్ళి, అతని కుమారుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడైన కొడుకు, డ్రగ్స్ మత్తులో వున్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. నార్కోటిక్స్ కొనుగోలుకు తాను డబ్బులు ఇవ్వకపోవడంతోనే తనపై తన కుమారుడు దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









