తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేసిన కుమారుడి అరెస్ట్
- December 28, 2020
కువైట్ సిటీ:తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి గెంటేసిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. సల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధిత తల్లిదండ్రుల్లో తండ్రి వయసు 60 ఏళ్ళు. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్స్ రూమ్ ద్వారా తన ఆవేదనను బాధిత తండ్రి వెల్లగక్కుకున్నారు. వెంటనే పోలీసులు బాధిత వ్యక్తి ఇంటికి వెళ్ళి, అతని కుమారుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడైన కొడుకు, డ్రగ్స్ మత్తులో వున్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. నార్కోటిక్స్ కొనుగోలుకు తాను డబ్బులు ఇవ్వకపోవడంతోనే తనపై తన కుమారుడు దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







