దుబాయ్ లో కశ్మీరీ కుంకుమపువ్వు అమ్మకంపై ప్రధాని మోదీ ప్రశంసలు
- December 28, 2020
దుబాయ్:కశ్మీర్ గడ్డపై సేకరించిన కుంకుమపువ్వును దుబాయ్ లో అమ్మటంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కశ్మీరీ భౌగోళిక గుర్తింపు ఉన్న కుంకుమపువ్వుకు విదేశాల్లోనూ ఆదరణ లభిస్తుండటం శుభపరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు. డిసెంబర్ 8-9న దుబాయ్ లో జరిగిన యూఏఈ-ఇండియా ఫుడ్ సెక్యూరిటీ సమ్మిట్-2020 సమయంలో కశ్మీరీ కుంకుమపువ్వు దుబాయ్ మార్కెట్లోకి వచ్చిన విషయం తెలిసిందే. దుబాయ్ లోని అల్ మయ గ్రూప్ కశ్మీర్ భౌగోళిక గుర్తింపుతో ప్రమోట్ చేస్తోంది. అయితే..రేడియో ద్వారా తన మదీలో మాటలను ప్రజలతో పంచుకునే 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆయన దుబాయ్ కి కశ్మీరీ కుంకుమ పువ్వు ఎగుమతుల అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కశ్మీరీ భౌగోళిక గుర్తింపు సర్టిఫికెట్ పొందిన కుంకుమపువ్వును దుబాయ్ సూపర్ మార్కెట్లలో విక్రయిస్తుండటం సంతోషించదగిన విషయమని, కశ్మీరీ కుంకుమపువ్వును ఎగుమతులకు ఈ పరిణామం మరింత ప్రొత్సాహకరంగా మారనుందని ప్రధాని అభిప్రాయపడ్డారు. భారత దేశంలో సేకరించిన కుంకుపువ్వు విశిష్టమైనదని, ఔషధగుణాలు కలిగి ఉన్నదని మన్ కీ బాత్ లో మోదీ వివరించారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంపాదించగలిగిందని అన్నారు. ఇదిలాఉంటే..ప్రధాని దుబాయ్ లో కశ్మీరీ కుంకుమపువ్వు అమ్మకాలను ప్రస్తావించటం తమకు గర్వంగా ఉందని అల్ మయ గ్రూప్ డైరెక్టర్ కమల్ వచని సంతోషం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









