సైబరాబాద్ కమిషనరేట్ 2020 క్రైమ్ రివ్యూ...

- December 29, 2020 , by Maagulf
సైబరాబాద్ కమిషనరేట్ 2020 క్రైమ్ రివ్యూ...

హైదరాబాద్:2020  సంవత్సరం మరో మూడు రోజులో ముగుస్తుండటంతో సైబరాబాద్ కమిషనరేట్ క్రైమ్ రివ్యూ తెలిపారు సీపీ సజ్జనార్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 2020 లో 6.65 శాతం క్రైమ్ రేట్ పెరిగింది. సైబర్ క్రైమ్ నేరాలు 135 % పెరిగాయి. ఆర్థిక నేరాలు 42 % పెరిగాయి. హత్యలు, హత్యాయత్నాలు 8 శాతం తగ్గాయి. దోపిడీలు, చోరీలు గత ఏడాది తో పిలిస్తే 12 శాతం తగ్గాయి.

రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 625 కేసులు నమోదు అయ్యాయి. అంటే గత ఏడాది పోలిస్తే 22.7 శాతం తగ్గాయి . మహిళలు వేధింపులకు సంబంధించి  2302 కేసులు నమోదు కాగా గత ఏడాది తో పోలిస్తే 18.66 శాతం తగ్గాయి. చిన్న పిల్లలు పై వేదింపులు 559 కేసులు నమోదు అయ్యాయి. అలాగే ఈఏడాది 76 మర్డర్ కేసులు నమోదయ్యాయి. అంటే గత ఏడాది తో పోలిస్తే 25 శాతం తగ్గినట్లు సజ్జనార్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com