అమెరికా లో టీఆర్ఎస్ ఎన్నారై అధికార ప్రతినిధి దేవేందర్రెడ్డి మృతి
- December 29, 2020
న్యూ జెర్సీ: అమెరికా న్యూజెర్సీలో టీఆర్ఎస్ ఎన్నారై అధికార ప్రతినిధి దేవేందర్రెడ్డి మృతి చెందారు. తన పని ముగించుకొని మెయిల్ బాక్స్లో ఉన్న లెటర్స్ తీసుకునేందుకు బయటికొచ్చిన దేవేందర్.. కారులో కూర్చొని ఆన్ చేయగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవేందర్ మృతి చెందారు. దేవేందర్..భార్య, ఏడేళ్ల కూతురితో కలిసి న్యూజెర్సీలో నివాసముంటున్నారు.
దేవేందర్రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లి. దేవేందర్ కుటుంబం గత కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడింది. దేవేందర్ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక న్యూజెర్సీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులోని బ్యాటరీ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందా..? లేక ఇంకేదైనా కారణముందా..? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
మరోవైపు దేవేందర్ మృతితో అమెరికాలో ఉంటున్న తెలుగువారంతా షాక్కు గురయ్యారు. దేవేందర్ హఠాన్మారణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త
- సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ భేటీ
- ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్
- పర్యాటక రంగం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి గ్రోత్ ఇంజిన్: మంత్రి కందుల దుర్గేష్
- అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ!
- చాట్జీపీటీలో పొరపాటున కూడా వీటిని సెర్చ్ చేయకండి
- ఆర్బీఐ కొత్త రూల్స్..ఏప్రిల్ 1 నుంచి మీ డబ్బు సేఫ్..
- 11 ఏళ్ల బాలుడిని కాపాడిన మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వైద్యులు









