అమెరికా లో టీఆర్ఎస్ ఎన్నారై అధికార ప్రతినిధి దేవేందర్రెడ్డి మృతి
- December 29, 2020న్యూ జెర్సీ: అమెరికా న్యూజెర్సీలో టీఆర్ఎస్ ఎన్నారై అధికార ప్రతినిధి దేవేందర్రెడ్డి మృతి చెందారు. తన పని ముగించుకొని మెయిల్ బాక్స్లో ఉన్న లెటర్స్ తీసుకునేందుకు బయటికొచ్చిన దేవేందర్.. కారులో కూర్చొని ఆన్ చేయగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన దేవేందర్ మృతి చెందారు. దేవేందర్..భార్య, ఏడేళ్ల కూతురితో కలిసి న్యూజెర్సీలో నివాసముంటున్నారు.
దేవేందర్రెడ్డి స్వస్థలం నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కర్నాటిపల్లి. దేవేందర్ కుటుంబం గత కొన్నేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడింది. దేవేందర్ మృతి ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక న్యూజెర్సీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులోని బ్యాటరీ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందా..? లేక ఇంకేదైనా కారణముందా..? అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
మరోవైపు దేవేందర్ మృతితో అమెరికాలో ఉంటున్న తెలుగువారంతా షాక్కు గురయ్యారు. దేవేందర్ హఠాన్మారణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు