నా మాతృ భూమి.....!!
- February 21, 2016
రోజూ నన్ను నేను మోసం చేసుకుంటునే ఉన్నా
కన్నతల్లిని మరిచా పురిటి గడ్డను వదిలేసా
డాలర్ల బరువుతో రూపాయిని బేరీజు వేసా
చిన్నప్పుడు పుస్తకాల్లో చదివిన దేశభక్తిని వదిలేసా
అమ్మ భాష కూడు బెట్టలేదని అరకొరగా వచ్చిన
ఆంగ్ల భాషను అందలమెక్కించా అదే జీవితమనుకొన్నా
అనుక్షణం భయంతో చస్తూ బతుకుతున్నా
అదే స్వర్గమని మాయలో పడి అమృతమయిని
నిరాదరణకు గురి చేసిన నా నిర్లక్ష్యపు విలువ
కట్టలు తెంచుకున్న ఓ కన్నపేగు ఆక్రోశం చేసిన ఆర్తనాదం
వేల గొంతుకలుగా గుచ్చుతుంటే...
సప్త సముద్రాలను దాటిన మాతృప్రేమలో కలసిన
దేశాభిమానం మదిని తాకుతూనిదురలేపగా
కలో గంజో అయినవాళ్ళ మద్యన తాగుతూ
జన్మనిచ్చిన అమ్మ ఋణం కన్నా ఆ అమ్మకు
ప్రాణం పోసిన గడ్డ పవిత్రతే ముఖ్యమని
అసహనం, అసమానత, జాత్యహంకారాలు దరిజేరనీయక
పరమత సహనం, శాంతి, సౌభ్రాతృత్వం పెంచుతూ
మంచి మానవత్వం మనదని చాటుతూ
సాటివారి కష్టానికి చేయి అందిస్తూ
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న
గురజాడ మాటని అక్షరాలా నిజం చేసిన మనసున్న
మనుష్యులున్న భరతభూమి నా మాతృ భూమిపై
పెంచుకుకున్నా అనుబంధం తెంచుకోలేక
ఉండి పోతా తుది శ్వాస వరకు ఈ గడ్డ పైనే..!!
--మంజు యనమదల
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









