కువైట్:రెసిడెన్సీ వయోలేటర్స్ కు క్షమాభిక్ష గడువు జనవరి 31వరకు పెంపు
- December 31, 2020
కువైట్ సిటీ:నివాస అనుమతుల గడువు ముగిసిన ప్రవాసీయులకు క్షమాభిక్ష గడువును పెంచింది కువైట్ ప్రభుత్వం. జనవరి 31 వరకల్లా దేశం విడిచి వెళ్లే వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని వెల్లడించింది. కువైట్లోని ప్రవాసీయుల రెసిడెన్సీ గడువుకు సంబంధించి కువైట్ ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన వాళ్లందరూ రెసిడెన్సీ స్టేటస్ మార్చుకోవాలనుకున్నా...దేశం విడిచి వెళ్లాలనుకున్నా ఫైన్ చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. క్షమాభిక్ష గడువు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని ఆలోగా దేశం విడిచి వెళ్లినా..స్టేటస్ మార్చుకున్నా లీగల్ యాక్షన్ ఉండదని వివరించింది. అయితే.ఇప్పుడు మరోసారి క్షమాభిక్ష గడువును జనవరి 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత గడువు లోగా ఫైన్ చెల్లించి రెసిడెన్సీ స్టేటస్ మార్చుకోకపోయినా...దేశం వదిలి వెళ్లకపోయినా లీగల్ యాక్షన్ ఎదుర్కొవాల్సి వస్తుందని కువైట్ హెచ్చరించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









