కువైట్:రెసిడెన్సీ వయోలేటర్స్ కు క్షమాభిక్ష గడువు జనవరి 31వరకు పెంపు
- December 31, 2020కువైట్ సిటీ:నివాస అనుమతుల గడువు ముగిసిన ప్రవాసీయులకు క్షమాభిక్ష గడువును పెంచింది కువైట్ ప్రభుత్వం. జనవరి 31 వరకల్లా దేశం విడిచి వెళ్లే వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని వెల్లడించింది. కువైట్లోని ప్రవాసీయుల రెసిడెన్సీ గడువుకు సంబంధించి కువైట్ ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన వాళ్లందరూ రెసిడెన్సీ స్టేటస్ మార్చుకోవాలనుకున్నా...దేశం విడిచి వెళ్లాలనుకున్నా ఫైన్ చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. క్షమాభిక్ష గడువు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని ఆలోగా దేశం విడిచి వెళ్లినా..స్టేటస్ మార్చుకున్నా లీగల్ యాక్షన్ ఉండదని వివరించింది. అయితే.ఇప్పుడు మరోసారి క్షమాభిక్ష గడువును జనవరి 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత గడువు లోగా ఫైన్ చెల్లించి రెసిడెన్సీ స్టేటస్ మార్చుకోకపోయినా...దేశం వదిలి వెళ్లకపోయినా లీగల్ యాక్షన్ ఎదుర్కొవాల్సి వస్తుందని కువైట్ హెచ్చరించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన