కువైట్:రెసిడెన్సీ వయోలేటర్స్ కు క్షమాభిక్ష గడువు జనవరి 31వరకు పెంపు
- December 31, 2020
కువైట్ సిటీ:నివాస అనుమతుల గడువు ముగిసిన ప్రవాసీయులకు క్షమాభిక్ష గడువును పెంచింది కువైట్ ప్రభుత్వం. జనవరి 31 వరకల్లా దేశం విడిచి వెళ్లే వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోబోమని వెల్లడించింది. కువైట్లోని ప్రవాసీయుల రెసిడెన్సీ గడువుకు సంబంధించి కువైట్ ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. గడువు ముగిసిన వాళ్లందరూ రెసిడెన్సీ స్టేటస్ మార్చుకోవాలనుకున్నా...దేశం విడిచి వెళ్లాలనుకున్నా ఫైన్ చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. క్షమాభిక్ష గడువు డిసెంబర్ 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని ఆలోగా దేశం విడిచి వెళ్లినా..స్టేటస్ మార్చుకున్నా లీగల్ యాక్షన్ ఉండదని వివరించింది. అయితే.ఇప్పుడు మరోసారి క్షమాభిక్ష గడువును జనవరి 31 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత గడువు లోగా ఫైన్ చెల్లించి రెసిడెన్సీ స్టేటస్ మార్చుకోకపోయినా...దేశం వదిలి వెళ్లకపోయినా లీగల్ యాక్షన్ ఎదుర్కొవాల్సి వస్తుందని కువైట్ హెచ్చరించింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







