గ్లోబల్ ప్రవాసీ రిష్తా పోర్టల్ మరియు మొబైల్ యాప్ ప్రారంభం
- December 31, 2020భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డిసెంబర్ 30న గ్లోబల్ ప్రవాసీ రిష్తా పోర్టల్(http://www.pravasirishta.gov.in/) అలాగే యాప్ని ప్రారంభించడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా వున్న 3.12 కోట్ల మంది భారతీయుల కోసం వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ, ఇండియన్ మిషన్స్ అలాగే మినిస్ట్రీ, ఇండియన్ డయాస్పోరా మధ్య మూడు కోణాల్లో కమ్యూనికేషన్ కోసం వీటిని ప్రారంభించినట్లు చెప్పారు. విదేశాల్లో వుంటోన్న మొత్తం 3.12 కోట్ల మంది భారతీయుల్లో 1.78 మంది ఎన్నారైలు కాగా, 1.34 కోట్ల మంది పిఐఓలు. ప్రతి విషయంలో విదేశాల్లోని భారతీయులతో సంప్రదించేలా, వారితో ఆలోచనల్ని పంచుకునేలా ఈ ప్రవాసీ రిష్తా పోర్టల్ని ప్రారంభించినట్లు చెప్పారు మంత్రి. ఇండియన్ డయాస్పోరా మెంబర్స్ (పీఐఓలు, ఎన్నారైలు, ఓసీఐలు) రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా పోర్టల్ని ప్రారంభించారు. ఎలాంటి క్రైసిస్ మేనేజ్మెంట్ అయినా, సహాయ సహకారాలు అందించేలా ఈ పోర్టల్, యాప్ ఉపకరిస్తాయి. పాస్పోర్ట్, వీసా సహా ఇతర కాన్సులర్ సేవలకు సంబంధించి కూడా ఇక్కడ ఉపయోగకరమైన సమాచారం లభిస్తుంది. ఇప్పటిదాకా ఈ తరహా సమాచార వ్యవస్థ ఏదీ లేకపోవడంతో, ఈ కొత్త విధానం విదేశాల్లో వున్న భారతీయులకీ, వారికి టచ్లోకి వెళ్ళేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకీ ఉపయుక్తంగా వుంటుంది.
తాజా వార్తలు
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్
- ఎమిరేట్స్ విమానం ఢీకొని 36 ఫ్లెమింగోల మృతి