కొత్త మెట్రో స్టేషన్లతో వేలాది మంది రెసిడెంట్స్, ప్రాపర్టీ ఇన్వెస్టర్స్కి లబ్ది
- December 31, 2020
దుబాయ్: పదుల సంఖ్యలో ఇన్వెస్టర్లకూ, వేల సంఖ్యలో రెసిడెంట్స్కీ, కొత్త దుబాయ్ మెట్రో స్టేషన్లతో లబ్ది చేకూరుతుందని, నఖీల్ కమ్యూనిటీల్లోని వారికి ప్రత్యేకించి అనూహ్యమైన లబ్ది జరుగుతుందని మాస్టర్ డెవలపర్ నఖీల్ పేర్కొంది. జనవరి 1 నుంచి కొత్త మెట్రో స్టేషన్లు తెరచుకోనున్నాయి. జబెల్ అలి, ది గార్డెన్స్, డిస్కవరీ గార్డెన్స్ అలాగే అల్ ఫుర్జాన్లలో మెట్రో స్టేషన్లు జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్న విసయం విదితమే. నఖీల్కి చెందిన అల్ ఫుర్జాన్, డిస్కవరీ గార్డెన్స్ అలాగే ఆర్డెన్స్ కమ్యూనిటీ మ్తొంగా 1,000 హెక్టార్లలో విస్తరించి వుంది. సుమారు 95,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. రూట్ 2020 విస్తరణలో భాగంగా ఆర్టిఎకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు నఖీల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అకిల్ కాజిమ్ చెప్పారు. మెట్రో స్టేషన్ నుంచి నడిచేందుకు వీలున్నంత దూరంలో ప్రాపర్టీస్ అమ్మకాలు, అద్దెలు విపరీతంగా పెరిగినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్చుక్ సంచలన పోస్ట్!







