కొత్త మెట్రో స్టేషన్లతో వేలాది మంది రెసిడెంట్స్, ప్రాపర్టీ ఇన్వెస్టర్స్కి లబ్ది
- December 31, 2020
దుబాయ్: పదుల సంఖ్యలో ఇన్వెస్టర్లకూ, వేల సంఖ్యలో రెసిడెంట్స్కీ, కొత్త దుబాయ్ మెట్రో స్టేషన్లతో లబ్ది చేకూరుతుందని, నఖీల్ కమ్యూనిటీల్లోని వారికి ప్రత్యేకించి అనూహ్యమైన లబ్ది జరుగుతుందని మాస్టర్ డెవలపర్ నఖీల్ పేర్కొంది. జనవరి 1 నుంచి కొత్త మెట్రో స్టేషన్లు తెరచుకోనున్నాయి. జబెల్ అలి, ది గార్డెన్స్, డిస్కవరీ గార్డెన్స్ అలాగే అల్ ఫుర్జాన్లలో మెట్రో స్టేషన్లు జనవరి 1 నుంచి అందుబాటులోకి రానున్న విసయం విదితమే. నఖీల్కి చెందిన అల్ ఫుర్జాన్, డిస్కవరీ గార్డెన్స్ అలాగే ఆర్డెన్స్ కమ్యూనిటీ మ్తొంగా 1,000 హెక్టార్లలో విస్తరించి వుంది. సుమారు 95,000 మంది ఇక్కడ నివసిస్తున్నారు. రూట్ 2020 విస్తరణలో భాగంగా ఆర్టిఎకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు నఖీల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ అకిల్ కాజిమ్ చెప్పారు. మెట్రో స్టేషన్ నుంచి నడిచేందుకు వీలున్నంత దూరంలో ప్రాపర్టీస్ అమ్మకాలు, అద్దెలు విపరీతంగా పెరిగినట్లు ఆయన వివరించారు.
తాజా వార్తలు
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!
- అల్పపీడన ద్రోణి..ఒమన్ వ్యాప్తంగా వర్షాలు..!!
- ప్రాంతీయ భద్రతపై రియాద్ లో కీలక సమావేశం..!!
- కువైట్ లో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- ఖతార్ ఆహార భద్రతా వ్యవస్థ పటిష్ఠంగా ఉంది: ఫైసల్ అల్-థానీ
- ఈద్ అల్ ఫితర్: అబుదాబిలో 4 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- సున్నితమైన ఫోటోలు ఆన్లైన్లో పోస్ట్..కేసు నమోదు..!!









