రాష్ట్రంలో రూ. 4.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు ...
- February 22, 2016
కలెక్టర్ల సదుస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించారు. వచ్చేనెలలో పట్టిసీమ ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామని ఆయన అన్నారు. 80 టీఎంసీల నీటిని గోదావరి నుంచి తరలిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యుత్ రంగంలో రాష్ట్రానికి ఆరు అవార్డులు వచ్చాయని ఆయన అన్నారు. ఉపాధిహామీ, నాబార్డు, పంచాయతీ నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు. రెయిన్గన్ల ద్వారా పంటలను కాపాడుదామని ఆయన పిలుపునిచ్చారు. గతేడాది తీసుకున్న చర్యలు వల్ల భూగర్భజలమట్టం పెరిగిందని సీఎం అన్నారు. వచ్చే ఏడాది లక్ష ఎకరాలకు రెయిన్గన్లు ఆర్డర్ ఇస్తామని ఆయన హామినిచ్చారు. పేద ప్రజలకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సంస్థల సహకారంతో అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వైద్య రంగంలో మనం చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని ఆయన కొనియాడారు. విశాఖలో ఇన్వెస్టర్స్ మీట్ విజయవంతంగా నిర్వహించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ. 4.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు ముందుకొచ్చారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని చంద్రబాబు హామినిచ్చారు. ఈ ఏడాది కృష్ణా డెల్టాకు సకాలంలో నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









