రాష్ట్రంలో రూ. 4.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు ...
- February 22, 2016
కలెక్టర్ల సదుస్సులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధి గురించి చర్చించారు. వచ్చేనెలలో పట్టిసీమ ప్రాజెక్ట్ను పూర్తిచేస్తామని ఆయన అన్నారు. 80 టీఎంసీల నీటిని గోదావరి నుంచి తరలిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. విద్యుత్ రంగంలో రాష్ట్రానికి ఆరు అవార్డులు వచ్చాయని ఆయన అన్నారు. ఉపాధిహామీ, నాబార్డు, పంచాయతీ నిధులతో గ్రామాల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని చంద్రబాబు తెలిపారు. రెయిన్గన్ల ద్వారా పంటలను కాపాడుదామని ఆయన పిలుపునిచ్చారు. గతేడాది తీసుకున్న చర్యలు వల్ల భూగర్భజలమట్టం పెరిగిందని సీఎం అన్నారు. వచ్చే ఏడాది లక్ష ఎకరాలకు రెయిన్గన్లు ఆర్డర్ ఇస్తామని ఆయన హామినిచ్చారు. పేద ప్రజలకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు సంస్థల సహకారంతో అన్ని వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వైద్య రంగంలో మనం చేపట్టిన సంస్కరణలు దేశానికే ఆదర్శమని ఆయన కొనియాడారు. విశాఖలో ఇన్వెస్టర్స్ మీట్ విజయవంతంగా నిర్వహించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో రూ. 4.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు ముందుకొచ్చారని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్ట్లను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తామని చంద్రబాబు హామినిచ్చారు. ఈ ఏడాది కృష్ణా డెల్టాకు సకాలంలో నీరందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







