జనవరి 7న హైదరాబాద్ లో మజ్దూర్ ప్రవాసి భారతీయ దివస్
- January 02, 2021
హైదరాబాద్:నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ మరియు ఎమిగ్రెంట్స్ వెల్ఫేర్ ఫోరం సంయుక్తంగా ఈనెల 7న హైదరాబాద్ లో మజ్దూర్ ప్రవాసి భారతీయ దివస్ ను నిర్వహిస్తున్నట్లు సిస్టర్ లిసీ జోసెఫ్,మంద భీంరెడ్డి లు ఒక ప్రకటనలో తెలిపారు.గల్ఫ్ కార్మికులకు 'జస్టిస్ ఫర్ వేజ్ తెఫ్ట్' (జీతం దొంగతనం గురించి న్యాయం చేయాలని), కొత్తగా గల్ఫ్ వెళ్ళే కార్మికులకు కనీస వేతనాలు (మినిమమ్ రెఫరల్ వేజెస్) 30 నుండి 50 శాతం తగ్గిస్తూ భారత ప్రభుత్వం సెప్టెంబర్ లో జారీచేసిన రెండు సర్కులర్లను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ఈనెల 9న ఢిల్లీ నిర్వహించే 16వ 'ప్రవాసి భారతీయ దివస్' సంపన్నులైన ఎన్నారైల జాతర అని, గల్ఫ్ దేశాలలో కష్టాలు పడుతున్న వలస కార్మికుల సమస్యలను చర్చించడానికి ఇందులో తగిన ప్రాధాన్యత ఇవ్వనందున తాము మజ్దూర్ ప్రవాసి భారతీయ దివస్ నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.
కోవిడ్19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికుల ఆరోగ్యం,జీవనోపాధి,ఆదాయంపై భారీ ప్రభావాన్ని చూపింది.గల్ఫ్ కార్మికులు పెద్ద సంఖ్యలో వాపస్ వచ్చారు,భారీగా నష్టపోయారు.స్వదేశానికి తిరిగి వచ్చిన చాలామంది కార్మికులు వారి జీతం బకాయిలు, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు పొందలేకపోయారు.భారత ప్రభుత్వ స్పందన వలసకార్మికుల హక్కుల రక్షణ,సంక్షేమాన్ని కోరేదిగా లేదు.గల్ఫ్ దేశాలలో పనిచేయాలనుకునే కార్మికుల కనీస వేతనాలను 30 నుండి 50 శాతం తగ్గించిన భారత ప్రభుత్వం లక్షలాది మంది వలసజీవుల ఆశలను అడియాశలు చేసిందని లిసీ, భీంరెడ్డి అన్నారు.
తాజా వార్తలు
- టిటిడి విద్యాసంస్థల్లో ‘స్మార్ట్’ చదువులకు సీఎం చంద్రబాబు ఆదేశం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్









