తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

- January 03, 2021 , by Maagulf
తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు

హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 394 కరోనా కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,87,502కి చేరింది.ఇందులో 2,80,505 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 5,388 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక  తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో  కరోనా మొత్తం 1549 మంది మృతి చెందారు.కరోనా కొత్త వైరస్ కేసులు కూడా రాష్ట్రాన్ని భయపెడుతున్నాయి.రాష్ట్రంలో సెకండ్ వేవ్ లేదని, ప్రస్తుతం కరోనా అదుపులోనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలియజేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com