సౌదీ అరేబియాలో అగ్ని ప్రమాదం..ముగ్గురు సజీవ దహనం

- January 03, 2021 , by Maagulf
సౌదీ అరేబియాలో అగ్ని ప్రమాదం..ముగ్గురు సజీవ దహనం

రియాద్:సౌదీ అరేబియాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు. తల్లితో పాటు మరో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. అబు అరిష్ గవర్నరేట్ పరిధిలోని జిజాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు అంతస్తుల ఇంట్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో చనిపోయిన వాళ్లంతా మూడు నుంచి ఎనిమిదేళ్ల లోపు పిల్లలు. ప్రమాదం గురించి సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే..మంటలు ఎలా వ్యాపించాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com