సౌదీ అరేబియాలో అగ్ని ప్రమాదం..ముగ్గురు సజీవ దహనం
- January 03, 2021
రియాద్:సౌదీ అరేబియాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు. తల్లితో పాటు మరో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. అబు అరిష్ గవర్నరేట్ పరిధిలోని జిజాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు అంతస్తుల ఇంట్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో చనిపోయిన వాళ్లంతా మూడు నుంచి ఎనిమిదేళ్ల లోపు పిల్లలు. ప్రమాదం గురించి సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే..మంటలు ఎలా వ్యాపించాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









