సౌదీ అరేబియాలో అగ్ని ప్రమాదం..ముగ్గురు సజీవ దహనం
- January 03, 2021
రియాద్:సౌదీ అరేబియాలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి ముగ్గురు చిన్నారులు సజీవ దహనం అయ్యారు. తల్లితో పాటు మరో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. అబు అరిష్ గవర్నరేట్ పరిధిలోని జిజాన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు అంతస్తుల ఇంట్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో చనిపోయిన వాళ్లంతా మూడు నుంచి ఎనిమిదేళ్ల లోపు పిల్లలు. ప్రమాదం గురించి సమాచారం అందగానే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే..మంటలు ఎలా వ్యాపించాయనేది ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









