షార్జా స్కూళ్ళలో ఫీజులు పెరుగుతాయ్

- May 28, 2015 , by Maagulf
షార్జా స్కూళ్ళలో ఫీజులు పెరుగుతాయ్

షార్జాలోని 48 ప్రైవేటు స్కూళ్ళు ఫీజుల్ని పెంచుకునేందుకు షార్జా ఎడ్యుకేషన్‌ జోన్‌ అనుమతినిచ్చింది. ఈ అనుమతితో 2015-16 విద్యా సంవత్సరానికిగాను 3 నుంచి 10 శాతం స్కూలు ఫీజుల్లో పెరుగుదల ఉండనుంది. షార్జాకి చెందిన ప్రైవేట్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ, స్కూళ్ళ నుంచి వచ్చిన విన్నపం మేరకు ఫీజు పెంపుపై సానుకూల నిర్ణయం వెలువడిరదని చెప్పారు. వివిధ స్కూళ్ళలో ఉన్న సౌకర్యాలు, స్టాండర్డ్స్‌ని బట్టి ఫీజుల పెంపు శాతం ఆధారపడి ఉంటుందన్నారు. అయితే కొన్ని స్కూళ్ళలో ఇప్పటికే అత్యధికంగా ఫీజులు ఉండటంతో వాటికి మాత్రం పెంపును అంగీకరించలేదు. అమెరికన్‌, బ్రిటిష్‌, ఇండియన్‌ కరికులమ్‌ స్కూల్స్‌ ఇందులో ఉన్నాయి. గత సంవత్సరం 60 స్కూళ్ళు ఫీజు పెంపు గురించి అభ్యర్థించగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 50కి పరిమితమైంది. ఫీజుల పెంపుపై ఓ కమిటీ స్కూళ్ళు అన్నిటినీ సందర్శించి సౌకర్యాలను పరిశీలించి పెంపుపై నిర్ణయాన్ని వెల్లడిరచింది. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఫీజు పెంపు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది.

   --- సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com