షార్జా స్కూళ్ళలో ఫీజులు పెరుగుతాయ్
- May 28, 2015
షార్జాలోని 48 ప్రైవేటు స్కూళ్ళు ఫీజుల్ని పెంచుకునేందుకు షార్జా ఎడ్యుకేషన్ జోన్ అనుమతినిచ్చింది. ఈ అనుమతితో 2015-16 విద్యా సంవత్సరానికిగాను 3 నుంచి 10 శాతం స్కూలు ఫీజుల్లో పెరుగుదల ఉండనుంది. షార్జాకి చెందిన ప్రైవేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ, స్కూళ్ళ నుంచి వచ్చిన విన్నపం మేరకు ఫీజు పెంపుపై సానుకూల నిర్ణయం వెలువడిరదని చెప్పారు. వివిధ స్కూళ్ళలో ఉన్న సౌకర్యాలు, స్టాండర్డ్స్ని బట్టి ఫీజుల పెంపు శాతం ఆధారపడి ఉంటుందన్నారు. అయితే కొన్ని స్కూళ్ళలో ఇప్పటికే అత్యధికంగా ఫీజులు ఉండటంతో వాటికి మాత్రం పెంపును అంగీకరించలేదు. అమెరికన్, బ్రిటిష్, ఇండియన్ కరికులమ్ స్కూల్స్ ఇందులో ఉన్నాయి. గత సంవత్సరం 60 స్కూళ్ళు ఫీజు పెంపు గురించి అభ్యర్థించగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 50కి పరిమితమైంది. ఫీజుల పెంపుపై ఓ కమిటీ స్కూళ్ళు అన్నిటినీ సందర్శించి సౌకర్యాలను పరిశీలించి పెంపుపై నిర్ణయాన్ని వెల్లడిరచింది. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఫీజు పెంపు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది.
--- సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







