షార్జా స్కూళ్ళలో ఫీజులు పెరుగుతాయ్
- May 28, 2015
షార్జాలోని 48 ప్రైవేటు స్కూళ్ళు ఫీజుల్ని పెంచుకునేందుకు షార్జా ఎడ్యుకేషన్ జోన్ అనుమతినిచ్చింది. ఈ అనుమతితో 2015-16 విద్యా సంవత్సరానికిగాను 3 నుంచి 10 శాతం స్కూలు ఫీజుల్లో పెరుగుదల ఉండనుంది. షార్జాకి చెందిన ప్రైవేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ, స్కూళ్ళ నుంచి వచ్చిన విన్నపం మేరకు ఫీజు పెంపుపై సానుకూల నిర్ణయం వెలువడిరదని చెప్పారు. వివిధ స్కూళ్ళలో ఉన్న సౌకర్యాలు, స్టాండర్డ్స్ని బట్టి ఫీజుల పెంపు శాతం ఆధారపడి ఉంటుందన్నారు. అయితే కొన్ని స్కూళ్ళలో ఇప్పటికే అత్యధికంగా ఫీజులు ఉండటంతో వాటికి మాత్రం పెంపును అంగీకరించలేదు. అమెరికన్, బ్రిటిష్, ఇండియన్ కరికులమ్ స్కూల్స్ ఇందులో ఉన్నాయి. గత సంవత్సరం 60 స్కూళ్ళు ఫీజు పెంపు గురించి అభ్యర్థించగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 50కి పరిమితమైంది. ఫీజుల పెంపుపై ఓ కమిటీ స్కూళ్ళు అన్నిటినీ సందర్శించి సౌకర్యాలను పరిశీలించి పెంపుపై నిర్ణయాన్ని వెల్లడిరచింది. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఫీజు పెంపు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది.
--- సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







