షార్జా స్కూళ్ళలో ఫీజులు పెరుగుతాయ్
- May 28, 2015
షార్జాలోని 48 ప్రైవేటు స్కూళ్ళు ఫీజుల్ని పెంచుకునేందుకు షార్జా ఎడ్యుకేషన్ జోన్ అనుమతినిచ్చింది. ఈ అనుమతితో 2015-16 విద్యా సంవత్సరానికిగాను 3 నుంచి 10 శాతం స్కూలు ఫీజుల్లో పెరుగుదల ఉండనుంది. షార్జాకి చెందిన ప్రైవేట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారి ఒకరు మాట్లాడుతూ, స్కూళ్ళ నుంచి వచ్చిన విన్నపం మేరకు ఫీజు పెంపుపై సానుకూల నిర్ణయం వెలువడిరదని చెప్పారు. వివిధ స్కూళ్ళలో ఉన్న సౌకర్యాలు, స్టాండర్డ్స్ని బట్టి ఫీజుల పెంపు శాతం ఆధారపడి ఉంటుందన్నారు. అయితే కొన్ని స్కూళ్ళలో ఇప్పటికే అత్యధికంగా ఫీజులు ఉండటంతో వాటికి మాత్రం పెంపును అంగీకరించలేదు. అమెరికన్, బ్రిటిష్, ఇండియన్ కరికులమ్ స్కూల్స్ ఇందులో ఉన్నాయి. గత సంవత్సరం 60 స్కూళ్ళు ఫీజు పెంపు గురించి అభ్యర్థించగా, ఈ సంవత్సరం ఆ సంఖ్య 50కి పరిమితమైంది. ఫీజుల పెంపుపై ఓ కమిటీ స్కూళ్ళు అన్నిటినీ సందర్శించి సౌకర్యాలను పరిశీలించి పెంపుపై నిర్ణయాన్ని వెల్లడిరచింది. ఆ తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి ఫీజు పెంపు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది.
--- సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









