‘సామ్జామ్’తో హీరో నాగచైతన్య
- January 03, 2021హైదరాబాద్:అక్కినేని సమంత ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ వేదికగా ‘సామ్జామ్.. సమంత’ షోతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ షోలో సినీ ప్రముఖులతో ఆమె సరదాగా సంభాషిస్తున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, రానా, విజయ్ దేవరకొండ, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ సహా పలువురు తెలుగు సెలబ్రిటీలను ఆమె ఇంటర్వ్యూలు చేస్తూ ఆకట్టుకుంది.
తాజాగా ‘సామ్జామ్’ కార్యక్రమానికి నాగచైతన్య అతిథిగా విచ్చేశారు. కాగా నాగచైతన్య రావడం షోపై ఆసక్తి పెంచుతోంది. ప్రముఖ సెలబ్రిటీ జోడీగా పేరొందిన ‘చైసామ్’ చేసే సందడి ప్రేక్షకులను కచ్చితంగా అలరించనుంది. ఈ మేరకు ‘ఆహా’ తన ట్విటర్లో షోకు సంబంధించి వీరిద్దరి ఫొటోలు ఉంచి ‘చైసామ్’ కెమెస్ట్రీ చూడడానికి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్ చేశారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!