20 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న భారతీయుడు

- January 04, 2021 , by Maagulf
20 మిలియన్ దిర్హాములు గెలుచుకున్న భారతీయుడు

యూఏఈ:భారతదేశానికి చెందిన వ్యక్తి 20 మిలియన్ దిర్హాముల ప్రైజ్ మనీని బిగ్ టికెట్ డ్రాలో గెలుచుకున్నారు.అబుధాబిలో ఈ డ్రా నిర్వహించారు. అబ్దుస్సలామ్ ఎన్‌వి ఈ ఏడాది ర్యాఫిల్  డ్రా తొలి విజేతగా నిలిచారు. 323601 టిక్కెట్‌ను ఆయన డిసెంబర్ 29న కొనుగోలు చేయగా, ఆ టిక్కెట్‌కి బంపర్ ప్రైజ్ దక్కింది. కాగా, అబ్దుస్సలామ్ ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లలో ఒకటి అందుబాటులో లేకపోగా, ఇంకొకటి తప్పు నెంబర్‌గా తేలింది. అతన్ని కనుగొనేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. లక్కీ విన్నర్ ఆచూకీ కనుగొనేందుకు కమ్యూనిటీ మెంబర్స్ సహకరించాలని నిర్వాహకులు విజ్నప్తి చేస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com