డ్రంక్ & డ్రైవ్:మందు బాబులకు ఝలక్ ఇస్తున్న సైబరాబాద్ పోలీసులు..
- January 04, 2021హైదరాబాద్:డ్రంక్ అండ్ డ్రైవ్పై సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మద్యం తాగి డ్రైవిండ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనం నడిపై కేసులు నమోదు చేయడంతో పాటు.. వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గత వారం రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పోలీసులు చేస్తున్నారు. ఆదివారం రాత్రి 346 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో దాదాపు 26 నుంచి 45 ఏళ్ల వయస్సు వారు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇక పట్టుబడ్డ వాహనాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలే ఉన్నట్లు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ను పూర్తిగా అరికట్టే వరకు ఈ తనిఖీ చేస్తామని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు స్పష్టం చేశారు. కాగా, గత వారం రోజులుగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో సైబరాబాద్ పరిధిలో 3751 డీడీ కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ