డ్రంక్ & డ్రైవ్:మందు బాబులకు ఝలక్ ఇస్తున్న సైబరాబాద్ పోలీసులు..
- January 04, 2021
హైదరాబాద్:డ్రంక్ అండ్ డ్రైవ్పై సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. మద్యం తాగి డ్రైవిండ్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనం నడిపై కేసులు నమోదు చేయడంతో పాటు.. వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. గత వారం రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను పోలీసులు చేస్తున్నారు. ఆదివారం రాత్రి 346 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు.. వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారిలో దాదాపు 26 నుంచి 45 ఏళ్ల వయస్సు వారు ఉన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇక పట్టుబడ్డ వాహనాల్లో ఎక్కువ శాతం ద్విచక్ర వాహనాలే ఉన్నట్లు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ను పూర్తిగా అరికట్టే వరకు ఈ తనిఖీ చేస్తామని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు స్పష్టం చేశారు. కాగా, గత వారం రోజులుగా చేపట్టిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో సైబరాబాద్ పరిధిలో 3751 డీడీ కేసులు నమోదైనట్లు పోలీసు అధికారులు తెలిపారు.


తాజా వార్తలు
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు
- హై-టెక్ సేవలను ప్రారంభించిన రాయల్ హాస్పిటల్..!!
- జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- బహ్రెయిన్ లో దోమల వ్యాప్తి నివారణ పై స్పెషల్ ఫోకస్..!!
- కువైట్ లో మే 3 నుండి వైద్య సిబ్బందికి సెలవులు..!!
- ఆన్లైన్ కంటెంట్ పై సౌదీ అరేబియా కఠిన చర్యలు..!!
- భారీగా భారత్-యూఏఈ విమాన ఛార్జీలు..!!









